Home / జాతీయం
కర్ణాటకలోని కోలార్ నుంచి రాజస్థాన్లోని జైపూర్కు సుమారు 21 లక్షల రూపాయల విలువైన టమోటాలను తరలిస్తున్న ట్రక్కు అదృశ్యమైనట్లు కర్ణాటక పోలీసులు తెలిపారు. కోలార్కు చెందిన మెహత్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యంలోని ట్రక్ జూలై 27న బయలుదేరింది. కాని ఇప్పటివరకు చేరుకోలేదు.
తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ అధికారులు ప్రయాణీకుడి ట్రాలీ బ్యాగ్లో 47 కొండచిలువలు, రెండు బల్లులను స్వాధీనం చేసుకున్నారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్నారు.
జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న నలుగురిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) జవాన్ కాల్చిచంపాడు. బాధితుల్లో ముగ్గురు ప్రయాణికులు, ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) ఉన్నారు.రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ చేతన్ నలుగురిని కాల్చిచంపాడు. సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వాపి-బొరివలి స్టేషన్ మధ్య ఈ ఘటన జరిగింది.
పాకిస్థాన్ లో వరుస బాంబు దాడులతో ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని భయం భయ,గా బ్రతుకుతున్నారు. కాగా ఇప్పుడు తాజాగా మరో భయానక ఘటన చోటుచేసుకుంది. ఖైబర్ పంక్తుక్వా ప్రావిన్స్ లోని బజౌర్స్ ఖర్ పట్టణంలో జమియత్ ఉలేమా-ఈ-ఇస్లామ్-ఫజల్ సంస్థకు చెందిన మతపరమైన సమ్మేళనం జరుగుతుండగా
దాదాపు మూడు నెలలుగా కొనసాగుతున్న మణిపూర్ జాతి సంఘర్షణను సత్వరమే పరిష్కరించకపోతే, అది దేశానికి భద్రతా సమస్యలను సృష్టించే అవకాశం ఉందని ప్రతిపక్ష ఇండియా కూటమి ఆదివారం చెప్పింది. ఇండియా కూటమికి చెందిన 21 మంది ఎంపీల బృందం ఈశాన్య రాష్ట్రాన్ని సందర్శించిన తర్వాత మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉకేని రాజ్భవన్లో కలిసి తమ పరిశీలనలపై మెమొరాండం సమర్పించింది.
మణిపూర్ లో ఇటీవల చెలరేగిన హింసాత్మక ఘటనల నేపధ్యంలో ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. మయన్మార్ నుండి వచ్చి నివసిస్తున్న అక్రమ వలసదారుల బయోమెట్రిక్ డేటాను సేకరించడం ప్రారంభించింది. మణిపూర్లో జాతి ఘర్షణలు మయన్మార్ నుండి అక్రమంగా వలస వచ్చిన వారి ప్రమేయంతో పాటు, నార్కోటెర్రరిజంతో ముడిపడి ఉన్నాయి.
డీఎంకేను వంశపారంపర్య పార్టీగా అభివర్ణించిన హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై తమిళనాడు క్రీడాశాఖ మంత్రి ఉంధయనిధి స్టాలిన్ ఘాటుగా స్పందించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శిగా తన కుమారుడు జై షా స్దానాన్ని ఆయన ప్రశ్నించారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి PSLV-C 56 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. దీనిద్వారా 7 విదేశీ ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి పంపించారు. ఇందులో సింగపూర్కు చెందిన డీఎస్టీఏ ఎస్టీ ఇంజినీరింగ్ సంస్థకు చెందిన డీఎస్ ఎస్ఏఆర్ఉపగ్రహంతోపాటు నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెంచిన వెలాక్స్-ఏఎం, ఆర్కేట్, స్కూబ్-2, న్యూలియాన్, గెలాసియా-2, ఓఆర్బీ-12 శాటిలైట్లు ఉన్నాయి. ఇవన్నీ సింగపూర్కు చెందినవే కావడం విశేషం.
తమిళనాడులోని కృష్ణగిరిలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ పేలుడు కారణంగా సమీపంలోని ఓ హోటల్ భవనం కూలిపోగా, మరో నాలుగు భవనాలు పాక్షికంగా దెబ్బతినడంతో పలువురు చిక్కుకుపోయారు.పాతాయపేట లో ఉన్న ఈ బాణాసంచా తయారీ గోడౌన్లో తీవ్రంగా గాయపడిన 12 మందిని ఇప్పటివరకు ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశంలో మహిళలు, చిన్నారులకు.. బయటే కాదు ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోతుంది అనే ఘటనలు రోజు మనం చూస్తూనే ఉంటున్నాం. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. ఆ అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లోని సత్నా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.