Home / తప్పక చదవాలి
సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు గాను 15 మంది విపక్ష ఎంపీలను మిగిలిన సెషన్కు సస్పెండ్ చేస్తూ లోక్సభ ఈరోజు తీర్మానం చేసింది. సస్పెండ్ అయిన 15 మందిలో తొమ్మిదిమంది ఎంపీలు కాంగ్రెస్కు చెందిన వారు. వీరిని సస్పెండ్ చేస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానం చేశారు.
కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా గతంలో పాలకులు చేయనివిధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ -200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను సీఎం జగన్ ప్రారంభించారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా అధికార కాంగ్రెస్ శాసనసభ్యుడు గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ గురువారం ప్రకటించారు.ప్రొటెం స్పీకర్ ప్రకటన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కెటి రామారావు ఆయననుస్పీకర్ స్దానం వద్దకు తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టారు.
అదిలాబాద్ రిమ్స్లో రాత్రి వైద్య విద్యార్థులను బయటి వ్యక్తులు వచ్చి కొట్టడాన్ని నిరసిస్తూ రిమ్స్ విద్యార్థులు ప్రధాన గేట్ ముందర ధర్నాకు దిగారు. రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ దిష్టి బొమ్మను విద్యార్థులు దహనం చేశారు. తమ వార్డుల్లో సరైన సదుపాయాలు లేవని నిన్న సాయంత్రం డైరెక్టర్తో గట్టిగా మాట్లాడితే ఇలా రౌడీలను తీసుకువచ్చి దాడులు చేపియిస్తారా అని బాధితుడు కవిరాజు నిలదీశారు.
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబసమేతంగా గురువారం తెల్లవారు జామున గృహప్రవేశం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రాలతో ఆర్థిక, ఇంధన ప్రణాళిక శాఖ మంత్రిత్వ శాఖల బాధ్యతలను స్వీకరించారు.
పుంగనూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలు కనిపించకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారంటూ బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆరోపించారు. పుంగనూరు మంత్రి పెద్ది రెడ్డి జాగీరా అంటూ ఆయన ప్రశ్నించారు.
మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల తర్వాత మతపరమైన మరియు బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను నిషేధించాలని ఆదేశాలు జారీ చేసారు. అయితే సాధారణ మరియు నియంత్రిత లౌడ్ స్పీకర్ల వాడకంపై ఎటువంటి నియంత్రణ లేదని తెలిపారు.
భూములకి సంబంధించిన ధరణి పోర్టల్పై ఎక్కువగా ఫిర్యాదులు రావడంతో సిఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ధరణి యాప్ భద్రతపై సిఎం రేవంత్ రెడ్డి అధికారులని ఆరా తీశారు. ధరణిలో ఉన్న లోటుపాట్లపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్ఎ కమిషనర్ నవీన్ మిట్టల్ని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
గత కొద్ది కాలంగా వినియోగదారులకు చుక్కలు చూపించిన ఉల్లి, టమాటాల స్దానంలో తాజాగా వెల్లుల్లి చేరింది. దేశంలోని పలు ప్రాంతాల్లో వెల్లుల్లి ధర సుమారుగా రూ.400 కు చేరుకుంది. ఉల్లిపాయల సరఫరాలో కొరత ఏర్పడిన తరువాత దాని స్దానంలో వెల్లుల్లి వినియోగం పెరగడంతో దీని ధర అనూహ్యంగా పెరుగుతోంది.
బుధవారం లోక్సభలో కలర్ స్మోక్ ప్రయోగించి పోలీసుల చేతికి చిక్కిన నిందితులను సాగర్ శర్మ , మనోరంజన్ గా గుర్తించారు. వీరిలో సాగర్ శర్మ తీసుకున్న విజిటర్ పాస్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా పేరుమీద జారీ అయినట్లు తెలుస్తోంది. మైసూరుకు చెందిన మనోరంజన్ వృత్తిరీత్యా ఇంజనీర్ .