Home / తప్పక చదవాలి
దేశ ప్రజల అభిరుచుల్లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ బలపడే కొద్ది ప్రజలు లగ్జరీ వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం ఇండియా ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో ఐదవ స్థానంలో నిలిచింది. ఆర్థిక వ్యవస్థ బలపడినప్పుడు దేశ ప్రజల చేతిలో పెద్ద ఎత్తున డబ్బు అడుతున్నట్లు లెక్క. సంపన్నదేశాల్లో లభించే కార్లు కూడా మన దేశంలో లభిస్తున్నాయి.
మన కిచెన్లో ఏ పాత్రలో వంట చేసుకుంటే పోషక విలువలు నిల్వ ఉంటాయో ది నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషిన్ (ఎన్ఐఎన్) తాజగా ఓ గైడ్ను విడుదల చేసింది. దీనిపై సైంటిఫిక్గా దీర్థకాలంగా పాటు అధ్యయనం చేసింది. తర్వాత కన్సల్టెంట్లు, నిపుణలతో చర్చించి తాజా గైడ్ను విడుదల చేసింది.
బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి మధ్య మాటల యుద్ధం ముగిసేట్లు కనిపించడం లేదు. కాగా శనివారం నాడు నవనీత్ రాణా మరోమారు ఓవైసీని ఉద్దేశించి కొత్త వీడియోను విడుదల చేశారు. దేశంలోని ప్రతి గల్లిలో రామభక్తులు తిరుగుతున్నారని గుర్తు చేశారు
దేశవ్యాప్తంగా ఎన్నికల హీట్ పీక్కు చేరుకుంది. సోమవారం నాడు మూడవ విడత పోలింగ్ జరుగనుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం కాంగ్రెస్ పార్టీపై ఇటీవల కాలంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్పై బయటికి వచ్చారు. కాగా శనివారం నాడు ఆయన కన్నాట్ప్లేస్లోని హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఆయన వెంట భార్య సునీతా కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్, ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్తో పాటు ఢిల్లీ మంత్రి అతిషి వెంట వచ్చారు.
బీజేపీ మాదిరి కాంగ్రెస్కు సర్జికల్ దాడులు చేసే ధైర్యం లేదన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. శనివారం వికారాబాద్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అమిత్ షా . ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ బీజేపీకి ఓటేస్తే.. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు.
ఏపీలో కూటమి విజయం ఖాయమని ప్రజల ఉత్సాహం చూస్తుంటే అర్థమవుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో రోడ్షో నిర్వహించారు.ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ దేశాభివృద్ధికి మోదీ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు.
దరాబాద్ నగరం సంక్రాంతి సెలవుల రోజులను తలపిస్తుంది .ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఏపీ, తెలంగాణ ఓటర్లు స్వస్థలాల బాటపడుతున్నారు. దీంతో సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లతో పాటు నగరంలోని బస్టాండ్ల వద్ద రద్దీ నెలకొంది.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. కడప లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్.. బీజేపీ కీ బీ టీం గా చంద్రబాబు, పవన్, జగన్ పనిచేస్తున్నారని రాహుల్ విమర్శించారు. ప్రత్యేక హోదా పై జగన్ ఏనాడు కేంద్రాన్ని ప్రశ్నించలేదన్నారు.
ఆఫ్ఘనిస్తాన్లోని ఉత్తర ప్రావిన్స్ బగ్లాన్లో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో సుమారుగా 50 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ మతీన్ ఖనీ తెలిపారు.