Home / తప్పక చదవాలి
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐ చార్జిషీట్లో ప్రస్తావించిన కీలక అంశాలు బయటికి వచ్చాయి. హత్యకు కుట్ర చేశారని, ఘటనాస్థలంలో ఆధారాలు చెరిపేశారని సీబీఐ తెలిపింది. ఫొటోలు, గూగుల్ టేక్ అవుట్, లొకేషన్ డేటాను సీబీఐ కోర్టుకు సమర్పించింది. వివేకా హత్యకు అవినాష్, భాస్కర్రెడ్డి కుట్ర చేశారని సీబీఐ నిర్థారించింది.
మణిపూర్లో ఒక గుంపు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు చూపుతున్న వీడియోపై దేశం ఆగ్రహంతో ఊగిపోతుండగా, ప్రధాన నిందితుడు హుయిరేమ్ హెరోదాస్ మెయిటీ ఇంటిని గురువారం కొంతమంది వ్యక్తులు తగులబెట్టారు.మే 3న ఈశాన్య రాష్ట్రంలో జాతి హింస చెలరేగిన ఒక రోజు తర్వాత కాంగ్పోక్పి జిల్లాలోని ఒక గ్రామంలో జరిగిన ఈ సంఘటన రెండు నెలల తర్వాత బయటపడింది.
మోదీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై విధించిన రెండేళ్ల జైలు శిక్ష కేసులో సుప్రీంకోర్టులో విచారణ ఆగస్టు 4వ తేదీకి వాయిదా పడింది. మోదీ ఇంటి పేరున్న వారంతా దొంగలే అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు.దీనిపై విచారించిన సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.గుజరాత్ హైకోర్టులో అప్పీల్ చేసినా రాహుల్కు ఊరట దక్కలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు
Project-K: ప్రభాస్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ప్రాజెక్ట్-కే టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ వచ్చేశాయ్. అమెరికాలో జరుగుతోన్న శాన్డియాగో కామిక్ కాన్ ఫెస్టివల్లో దీనికి సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
టయోటా కిర్లోస్కర్ మోటార్ నుండి హిలక్స్ పికప్ ట్రక్ యొక్క మొదటి బ్యాచ్ వాహనాలనును ఇండియన్ ఆర్మీ అందుకుంది. ఈ వాహనాలను ఫ్లీట్లోకి చేర్చాలని నిర్ణయించే ముందు ఈ వాహనాన్ని భారత సైన్యం యొక్క టెక్నికల్ ఎవాల్యుయేషన్ కమిటీ యొక్క నార్తర్న్ కమాండ్ రెండు నెలల కఠినమైన పరీక్షలు నిర్వహించింది.
పాకిస్థాన్కు చెందిన సీమా హైదర్ కు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్న తన ప్రేమికుడు సచిన్ మీనాతో కలిసి ఉండటానికి నలుగురు పిల్లలతో అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్బంగా నేపాల్లోని పోఖారా నుండి బస్సు ఎక్కినప్పుడు ఆమె తన పేరు 'ప్రీతి'గా చెప్పినట్లు బయటపడింది.
భారీ వర్షాలతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అల్లకల్లోలమవుతోంది. అల్లూరిజిల్లాలో గోదావరి, శబరి నదులకి వచ్చిన వరదలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. విలీన మండలాలకి అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేరుకున్నారు. కూనవరం, విఆర్ పురం మండలాల్లో కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యటించారు.
నల్ల సముద్రంలో తన నౌకాశ్రయాల ద్వారా ఉక్రెయిన్ ధాన్యాన్ని సురక్షితంగా రవాణా చేయడానికి అనుమతించే అంతర్జాతీయ ఒప్పందాన్ని పొడిగించడానికి రష్యా నిరాకరించింది.రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ, ఇక నుండి నల్ల సముద్రంలోని ఉక్రేనియన్ నౌకాశ్రయాలకు ప్రయాణించే అన్ని నౌకలు మిలిటరీ కార్గో యొక్క వాహకాలుగా పరిగణించబడతాయని పేర్కొంది.
బాగ్దాద్లోని స్వీడిష్ రాయబార కార్యాలయంపై గురువారం తెల్లవారుజామున వందలాది మంది నిరసనకారులు దాడి చేసి నిప్పంటించారు,. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ను స్వీడన్లో తగులబెట్టడంతో షియా మతగురువు ముక్తాదా సదర్ మద్దతుదారులు ఈ నిరసనకు పిలుపునిచ్చారు,
వందే భారత్ రైలులో బాత్రూమ్ని ఉపయోగించినందుకు ఒక వ్యక్తి రూ.6,000 నష్టపోయాడు. దీనికి సంబంధించి వివరాలివి. అబ్దుల్ ఖాదిర్ అనే వ్యక్తి తన భార్య, 8 ఏళ్ల కొడుకుతో కలిసి హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్లోని తన స్వగ్రామం సింగ్రౌలీకి వెడుతున్నాడు