Home / తప్పక చదవాలి
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయ నిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్ ఈ నెలలోనే పలు బహిరంగ సభల్లో సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాదు.. దేశం నుంచి నిర్మూలించాల్సిందేనని వ్యాఖ్యానించారు.
చంద్రయాన్ 3 కి సంబంధించిన కీలక అప్డేట్ని ఇస్రో వెల్లడించింది. ఇవాళ చంద్రుడి దక్షిణ ధృవంపై మళ్ళీ పగలు ప్రారంభం కానుంది. ప్రస్తుతం నిద్రాణ స్థితిలో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్పై సూర్యకాంతి పడగానే మళ్లీ వాటిని మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తామని ఇస్రో ప్రకటించింది.
టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట దక్కలేదు. సిఐడి తరపు న్యాయవాదుల వాదనలతో ఏపీ హైకోర్టు ఏకీభవించి పిటిషన్ ను కొట్టేసింది.
రాజస్తాన్ లో సరస్సుల నగరంగా పేరుపొందిన ఉదయ్పూర్ మరోసారి వార్తల్లో నిలిచింది. సెప్టెంబరు 24న లీలా ప్యాలెస్లో పరిణీతి చోప్రా మరియు రాఘవ్ చద్దా వివాహానికి సన్నాహాలు జోరందుకున్నాయి.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిందితుడిగా ఉన్న స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని పిల్ వేశారు.
బుల్ బెడ్రూం ఇళ్లపై మంత్రి కేటీఆర్ కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్.. నీకు ఆ డేటా అసలు తెలుసా ? లేకపోతే ఒకసారి తెలుసుకోవాలని సూచించారు. 2.16 లక్షల ఇండ్లు కట్టినట్లు గూగుల్ ద్వారా తెలిసిందని కాని తెలంగాణ వ్యాప్తంగా లక్ష ఇళ్లు కూడా కట్టలేదని రాజాసింగ్ ఆరోపించారు.
అమెరికాలోని నార్త్ కరోలినాలో గూగుల్ మ్యాప్స్ సూచనలను అనుసరిస్తూ ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన జరిగింది. దీనితో అతని కుటుంబం ఇప్పుడు గూగుల్పై దావా వేసింది.ఫిలిప్ అనే వైద్య పరికరాల విక్రయదారుడు తన కుమార్తె తొమ్మిదవ పుట్టినరోజు వేడుక నుండి ఇంటికి వెళుతుండగా ఈ విషాద ఘటన జరిగింది.
పాకిస్థాన్ ఎన్నికల సంఘం (ECP) గురువారం సార్వత్రిక ఎన్నికల తేదీలను ప్రకటించింది. 2024 జనవరి చివరి వారంలో ఎన్నికలు నిర్వహించబడుతాయని ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల సంఘం నియోజకవర్గాల విభజనపై పనిని సమీక్షించిందని మరియు నియోజకవర్గాల డీలిమిటేషన్ కోసం ప్రాథమిక జాబితాను సెప్టెంబర్ 27 న ప్రచురించాలని నిర్ణయించినట్లు పాక్ వార్తా సంస్థ డాన్ నివేదించింది.
అమీర్ ఖాన్ '3 ఇడియట్స్'లో లైబ్రేరియన్ దూబే పాత్రలో నటించిన నటుడు అఖిల్ మిశ్రా కిచెన్ లో జారిపడి మరణించారు. రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న మిశ్రా వంటగదిలో జరిగిన ప్రమాదంలో గాయాలపాలై మృతి చెందినట్లు ఆయన భార్య సుజానే బెర్నెర్ట్ తెలిపారు.
కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాది మరియు వాంటెడ్ గ్యాంగ్స్టర్ అయిన సుఖ్దూల్ సింగ్ సుఖ హత్యకు గురైన దాదాపు గంట తర్వాత, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అతని హత్యకు బాధ్యత వహించింది.