Home / తప్పక చదవాలి
పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్లో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం, బలమైన ప్రకంపనల కారణంగా 2,000 మందికి పైగా మరణించారని తాలిబాన్ ప్రతినిధి ఆదివారం తెలిపారు. రెండు దశాబ్దాల్లో దేశంలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపాలలో ఇది ఒకటి.
రెండు వేల నోట్ల మార్పిడికి సంబంధించి పొడిగించిన గడువు కూడా ముగియనున్న నేపథ్యంలో ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. 8వ తేదీ తర్వాత కూడా నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంది. అయితే, ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
పొత్తులపై తాము ఎవరికీ చెప్పాల్సిన పనిలేదని ప్రజలకే చెబుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ మేము ఎన్ని చోట్ల పోటీ చేస్తాం.. ఎవరితో పొత్తు పెట్టుకుంటామనేది మీకు అనవసరమని వైసీపీ నేతలకు పరోక్షంగా సెటైర్లు వేసారు.
పురుషుల హాకీలో భారత్ మరోసారి ఆసియా ఛాంపియన్గా నిలిచింది. టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన తర్వాత, హాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో సంచలన ప్రదర్శన చేసింది.శుక్రవారం జరిగిన పురుషుల హాకీ ఫైనల్లో 5-1తో జపాన్ను ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకుంది.
ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి ఇరాన్ మహిళ నర్గీస్ మహ్మదీ దక్కించుకున్నారు. ప్రస్తుతం జైల్లో మగ్గుతున్న నర్గీస్ ఇరాన్లో అణిచివేయబడుతున్న మహిళలకు తరపున మానవ హక్కులకోసం.. ప్రతి ఒక్కరికి స్వేచ్చ కోసం ఆమె పోరాడుతున్నారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో ఎసిబి కోర్టు జడ్జి హిమబిందు తీర్పుని రిజర్వ్ చేశారు. సోమవారంనాడు తీర్పు ప్రకటిస్తామని ఎసిబి కోర్టు ప్రకటించింది.
మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పుట్టిన రోజు వేడుకల్లో హోంమంత్రి మహమూద్ అలీ సహనం కోల్పోయారు. తన గన్మన్పై చేయి చేసుకున్నారు. శ్రీనివాస యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి మహమూద్ అలీ ఆయనకి బొకే ఇవ్వాలనుకున్నారు.
ఆన్లైన్ పోర్టల్ న్యూస్క్లిక్ అక్రమ నిధుల కేసును విచారిస్తున్న ఢిల్లీ పోలీసులు తమ ఎఫ్ఐఆర్లో, భారతదేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడానికి మరియు దేశంపై అసంతృప్తిని కలిగించడానికి చైనా నుండి పెద్ద మొత్తంలో నిధులు వచ్చాయని పేర్కొన్నారు.
వైసీపీ నేత వేధింపులు తాళలేక టీటీడీ ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను సూసైడ్ నోట్లో రాశారు. ఈ ఘటన పేరూరులో తీవ్ర కలకలం రేపింది. పేరూరుకు చెందిన మునస్వామికి స్థానికంగా కొంత వ్యవసాయ భూమి ఉంది
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని వెస్ట్ మారేడుపల్లిలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) శుక్రవారం ప్రారంభించారు.విద్యార్థులను పలకరించిన కేటీఆర్ డైనింగ్ హాల్లో వారితో కలిసి అల్పాహారం చేశారు.