Home / తప్పక చదవాలి
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు అనారోగ్య వార్తలపై ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆందోళన నేపథ్యంలో పరిస్థితిని ప్రభుత్వం సమీక్షిస్తోంది. రాజమహేంద్రవరం కేంద్ర కరాగారంలో వసతులపై ప్రభుత్వం ఆరా తీస్తోంది.
అంగళ్ళు విధ్వంసం కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లక్ష పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులోమ పలువురికి బెయిల్ మంజూరయిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో కొందరు అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను, అభిమానులను వేధిస్తున్నారని అటువంటి వారికి మిత్తితో సహా చెల్లిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెచ్చరించారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖకు మార్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. సీఎంఓ షిఫ్టింగ్, మౌలిక సదుపాయాల ఏర్పాటు, మంత్రుల నివాసాల కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 బాట్లా హౌస్ ఎన్కౌంటర్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 15 ఏళ్ల నాటి ఈ కేసులో ఉరిశిక్ష పడిన దోషి, ఇండియన్ ముజాహీదిన్ ఉగ్రవాది ఆరిజ్ఖాన్ మరణశిక్షను ధ్రువీకరించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతామధు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ గాంధీ సిస్టమ్ కాదని.. బీఆర్ఎస్ జెండా పట్టుకున్న వాడికి, జెండా మోసిన వాడికే ఏ స్కీమ్ అయినా దక్కుతుందన్నారు. ఈ సందర్బంగా ఆయన ఉన్నతాధికారులను వాడు, వీడు అంటూ సంబోధించడం గమనార్హం.
కాంగ్రెస్లో విలీన ప్రక్రియ బెడిసి కొట్టడంతో వైఎస్ షర్మిల రూటు మార్చారు. తన సొంత పార్టీ వైఎస్ఆర్టిపి తరపునే తెలంగాణ ఎన్నికల్లో తలపడాలని వైఎస్ షర్మిల డిసైడయ్యారు. గురువారం నిర్వహించిన వైఎస్ఆర్టిపి కార్యవర్గ సమావేశంలో ఎన్నికల కార్యచరణపై నేతలు, క్యాడర్తో షర్మిల చర్చించారు.
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉత్తరాఖండ్లో పర్యటించారు. అతను శివుని పవిత్ర నివాసంగా భావించే ఆది కైలాస శిఖరం నుండి తన పర్యటనను ప్రారంభించారు. పార్వతి కుంద్ లోని ఆది కైలాస శిఖరం వద్ద ప్రార్థనలు చేశారు. తెల్లటి వస్త్రాలు ధరించిన మోదీ స్దానిక పూజారులు వీరేంద్ర కుటియాల్ మరియు గోపాల్ సింగ్ ల సూచనల మేరకు పూజలు నిర్వహించారు.
ఇజ్రాయెల్ నుండి స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయుల కోసం 'ఆపరేషన్ అజయ్' ప్రారంభించినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక చార్టర్ విమానాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నట్లు జైశంకర్ తెలిపారు. ప్రస్తుతం ఇజ్రాయెల్లో దాదాపు 18,000 మంది భారతీయులు నివసిస్తున్నారని అంచనా.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు గాజా స్ట్రిప్ నుండి హమాస్ను తుడిచిపెట్టేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇజ్రాయెల్ మిలటరీ గురువారం నాడు, గాజాలో 3,60,000 మంది బలగాలతో గ్రౌండ్ ఆపరేషన్కు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. అయితే, రాజకీయ నాయకత్వం ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదని ఉన్నత సైనిక అధికారి చెప్పారు.