Home / తప్పక చదవాలి
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 55 మంది అభ్యర్థులను తొలి లిస్ట్లో భాగంగా ప్రకటించింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు.
లాస్ ఏంజిల్స్ లో 2028లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ను కూడా జత చేస్తున్నట్లు ఐఓసీ బోర్డు అమోదం తెలిపింది. కాగా ఐఓసీ సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. వచ్చే ఒలింపిక్స్ ఐదు కొత్త క్రీడలను జత చేయనున్నారు.
టీడీపీ డ్రామాలు పీక్స్కి చేరాయని అందులో భాగంగానే చంద్రబాబుకు ముప్పు ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తప్పు చేసినట్లు ఆధారాలున్నాయని కోర్టు ధ్రువీకరించిందని అన్నారు.
చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ అన్నారు. దీనికి సంబంధించి నారా లోకేష్ చేసిన ట్వీట్ పూర్తిగా అవాస్తవమని ఆయన అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) హమాస్ మిలిటెంట్లను అంతమొందించడానికి 4,000 టన్నుల బరువున్న 6,000 బాంబులను ప్రయోగించడం ద్వారా గాజా స్ట్రిప్పై దాడిని కొనసాగించింది. యుద్ధం యొక్క ఆరవ రోజు తెల్లవారుజామున ప్రారంభమైన ఈ ఆపరేషన్లో డజన్ల కొద్దీ ఫైటర్ జెట్లు, హెలికాప్టర్ గన్షిప్లు మరియు విమానాలు కూడా ఉన్నాయి.
ఇజ్రాయెల్ లో అసహజ మరణాలకు గురైన వ్యక్తుల మృతదేహాలను వెలికితీసే జకా అనే సంస్థలో యోస్సీ అనే కార్యకర్త పనిచేస్తున్నాడు. అతను తాజాగా యుద్ద సమయంలో కూడా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల స్డెరోట్లో ఒక ఇజ్రాయెల్ మహిళ శవాన్ని తాను కనుగొన్నానని, ఆమె కడుపును చీల్చి శిశువును హమాస్ ఉగ్రవాదులు కత్తితో పొడిచి చంపారని చెప్పాడు.
ఇజ్రాయెల్ సైన్యం ఉత్తర గాజాలో కనీసం 1.1 మిలియన్ల మంది ప్రజలను ఖాళీ చేయమని ఆదేశించింది. గాజా నగర నివాసులను గాజా స్ట్రిప్ యొక్క దక్షిణ భాగంలోకి పారిపోవాలని ఆదేశించింది, హమాస్ మిలిటెంట్లు నగరం కింద సొరంగాలలో దాక్కున్నారని పేర్కొన్నారు. ఈ తరలింపు మీ భద్రత కోసమే నంటూ ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా పెను భూతంలా విస్తరిస్తున్న ఉగ్రవాదం పై కొన్ని దేశాలు ఉమ్మడి పోరుకు ముందుకు రాకపోవడం బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జీ - 20 పార్లమెంటరీ సమ్మిట్ ప్రధాని శుక్రవారం ప్రారంభించారు.
గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 2023లో మొత్తం 125 దేశాలకు గాను ఇండియా 111 ర్యాంకులో నిలిచింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ నివేదకను తప్పుబడుతోంది. ఏ గణాంకాల ప్రకారం ఈ నివేదికను తయారు చేశారని ప్రశ్నించింది.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీకి గుడ్బై చెప్పేశారు. ప్రస్తుతం పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని లక్ష్మయ్య రాజీనామా చేశారు. జనగామ టికెట్ విషయంలో పొన్నాల లక్ష్మయ్య అసంతృప్తితో ఉన్నారు. ఆ టికెట్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డికిస్తారంటూ ప్రచారం జరుగుతోంది.