Last Updated:

AP CMO office: ఏపీ సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ విడుదల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖకు మార్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. సీఎంఓ షిఫ్టింగ్, మౌలిక సదుపాయాల ఏర్పాటు, మంత్రుల నివాసాల కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

AP CMO office: ఏపీ సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ  విడుదల

AP CMO office: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖకు మార్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. సీఎంఓ షిఫ్టింగ్, మౌలిక సదుపాయాల ఏర్పాటు, మంత్రుల నివాసాల కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇందుకోసం పట్టణాభివృద్ధి, ఆర్ధిక, సాధారణ పరిపాలనా శాఖా కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేసింది. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం సామరస్యపూర్వక.. సమతుల్య వృద్ధి కోసం తీసుకున్న నిర్ణయంగా రాష్ట్ర ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం 2015 జీఓ విడుదల చేసింది.

జీవో నెంబర్ 2015 లో ఏమున్నదంటే..(AP CMO office)

రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలు.. ఆరోగ్యం, విద్య, నీటిపారుదల, తీవ్రత, కనెక్టివిటీ పరంగా తక్కువ సామాజిక-ఆర్థిక అభివృద్ధి సూచికలను ప్రదర్శిస్తున్నాయనీ, ఈ ప్రాంతంలో గిరిజన జనభా ఎక్కువగా ఉన్నట్లు వివరించారు. భారత ప్రభుత్వం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఈ ప్రాంతంలోని ఐదు జిల్లాల్లో నాలుగు వామపక్ష తీవ్రవాద (LWE) ప్రభావిత జిల్లాలుగా గుర్తించబడ్డాయనీ గుర్తు చేసిన ప్రభుత్వం.. ఇంకా పేర్కొన్న ప్రాంతంలోని కొన్ని జిల్లాలు బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ పరిధిలోకి వస్తాయని వివరించారు.

నీతి అయోగ్ గుర్తించిన మూడు ఆకాంక్షాత్మక జిల్లాల్లో రెండు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నాయని.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని చారిత్రక వెనుకబాటుతనానికి సంబంధించిన సందర్భాన్ని సముచితంగా అంగీకరిస్తూ, ఉత్తర కోస్తా ప్రాంతానికి అంటే రాష్ట్రంలోని ఉత్తరాంధ్రకు ప్రోత్సాహకాలు, ప్రత్యేక అభివృద్ధిని అందిస్తుందనీ వివరించారు. అందువల్ల, ఉత్తర కోస్తా జిల్లాలు అంటే ఉత్తరాంధ్ర ప్రాంత సమగ్ర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని జీవోలో స్పష్టం చేశారు.