Home / తప్పక చదవాలి
ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులుతో కూడిన విద్యుత్ అలంకరణ చేశారు. ఇది ఆలయానికి అపచారం అంటూ భక్తులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
ఏపీ అసైన్డ్ భూముల కేసులో కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఈ కేసు విచారణలో వాదనలు పూర్తి కావడంతో ఏపీ హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ అసైన్డ్ భూముల కేసులో కొత్త ఆధారాలు దొరికాయంటూ ఏపీ సిఐడి కోర్టు దృష్టికి తెచ్చింది. ఆడియో ఆధారాలని సిఐడి అధికారులు సమర్పించారు. రేపు వీడియో ఆధారాలు అందజేస్తామని సిఐడి చెప్పింది.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమానవీయంగా ఉందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
:ఇజ్రాయెల్ సరిహద్దుకు సమీపంలోని నిరిమ్ కిబ్బట్జ్ ప్రాంతంలో మరో సీనియర్ హమాస్ కమాండర్ బిల్లాల్ అల్-ఖేద్రాను హతమార్చినట్లు ఇజ్రాయెల్ వైమానిక దళం ఆదివారం తెలిపింది. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు కిబ్బట్జ్ నిరిమ్ ఊచకోతకు కారణమైన దక్షిణ ఖాన్ యునిస్లోని దళాల నుఖ్బా కమాండర్ బిల్లాల్ అల్ కేద్రాను గత రాత్రి చంపాయి.
దేశరాజధాని ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ-ఎన్సిఆర్ ప్రాంతంలో ఆదివారం 3.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనితో ప్రజలు ఆందోళన చెందారు. ప్రజలు భయంతో పరుగెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పూణేలోని ఎరవాడలో పోలీసులకు చెందిన 3 ఎకరాల భూమిని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ 2010లో వేలం వేసినట్లు పూణే మాజీ పోలీసు కమిషనర్ మీరన్ చద్దా బోర్వాంకర్ తన పుస్తకంలో పేర్కొన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ద్వారా 2జి స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొన్న బిడ్డర్కు ఈ భూమిని విక్రయించారని తెలిపారు.
మనీలాండరింగ్ కేసులో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) నాయకుడు, రాజ్యసభ మాజీ ఎంపి ఈశ్వర్లాల్ జైన్కు సంబంధించిన పలు ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) తాత్కాలికంగా అటాచ్ చేసింది.ఎన్సీపీ మాజీ కోశాధికారిగా కూడా పనిచేసిన ఈశ్వర్లాల్ జైన్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు అత్యంత సన్నిహితుడు.
ఆపరేషన్ అజయ్ లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి 197 మంది భారతీయులతో మూడవ విమానం ఢిల్లీ చేరుకుంది. ఇజ్రాయెల్ నుంచి తిరిగి వచ్చిన వారికి ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ స్వాగతం పలికారు. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన భారతీయులందరికీ మంత్రి భారత జెండాలను అందజేశారు.
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో కనకదుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. తొలిరోజు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించారు. ప్రజలపై ఎన్నికల వరాలు కురిపించారు. కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా పేరుతో కొత్త పథకం ప్రవేశపెడతామన్నారు. తెల్ల రేషన్కార్డు ఉన్న కుటుంబాలకు 5 లక్షల రూపాయల బీమా కల్పిస్తామన్నారు.