Home / తప్పక చదవాలి
కర్ణాటకలో ప్రజ్వల్ రేవన్న సెక్స్ టేప్స్ రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఇక ప్రజ్వల్ జర్మనీ పారిపోగా.. ఆయన తండ్రి హెచ్డీ రేవన్నను సిట్ పోలీసులు అరెస్టు చేశారు. ఇక కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జనతాదళ్ (సెక్యూలర్ ) చీఫ్ హెచ్డి-కుమారస్వామి పోలీసులపై తన అక్కసును వెళ్లగక్కారు.
సమాజ్వాదీ పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామమందిరాన్ని పనికిరానిదిగా వ్యాఖ్యానించారు. రామ మందిరం వాస్తు ప్రకారం నిర్మించబడలేదని ఆయన అన్నారు.నేను ప్రతిరోజూ రాముడిని పూజిస్తాను. రామనవమిపై కొంత మంది పేటెంట్ చేశారు. అయోధ్యలోని రామ మందిరం వాస్తు ప్రకారం సరిగా లేదని అన్నారు.
ఏపీలో జరిగేది క్లాస్ వార్ అని.. సీఎం జగన్ అన్నారు. ఓటు వేసే ముందు అంతా ఒక సారి ఆలోచించి ఓటు వేయాలని అభ్యర్థించారు. వైసీపీకి ఓటు వేస్తేనే పథకాలు కొనసాగుతాయని.. టీడీపీకి ఓటు వేస్తే.. పథకాలు ఆగిపోతాయని అన్నారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ జంక్షన్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.
ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు వస్తున్న సందర్బంగా గత పదేళ్లలో ఈ రాష్ట్రానికి ఏం చేసారో చెప్పి ఓట్లడగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. దయచేసి పవిత్రమైన నేలపై విషం చిమ్మకండని కోరారు. పిరమైన ప్రధాని నరేంద్రమోదీగారు మీరు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలోయావత్ తెలంగాణ సమాజం పక్షాన కొన్ని ప్రశ్నలు అంటూ సామాజిక మాధ్యమం x వేదికగా ప్రశ్నలు సంధించారు.
ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రాబోతోందని కాపు, బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. తన అంచనాల గురించి 6 నిమిషాల నిడివిగల వీడియో రిలీజ్ చేశారు.
ఎండలతో అల్లాడుతున్న తెలుగు ప్రజలకు భారత వాతావరణ విభాగం చల్లటి వార్త చెప్పింది. రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలిపారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ను గెలిపించాలని వీడియో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా.. అందరికీ మంచి చేయాలనే విషయంలో పవన్ ముందుంటాడని తెలిపారు.
గాజాపై ఇజ్రాయెల్ దాడులను మరింత ఉధృతం చేస్తోంది. తూర్పు రఫా ప్రాంతం నుంచి సుమారు లక్ష మంది పాలస్తీనియన్లు తాత్కాలికంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించింది. హమాస్కు ఇది అత్యంత పటిష్టమైన ప్రాంతమని ఇజ్రాయెల్ వాదిస్తోంది.
మే 13న జరగనున్న లోక్సభ మూడవ విడత ఎన్నికల పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్లు పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేయడానికి వారికి అవగాహన కార్యక్రమాలు కూడ కల్పిస్తున్నారు. ఈ నేపధ్యంలో బైక్ ట్యాక్సీ ప్రొవైడర్ రాపిడో పోలింగ్ రోజున ఓటింగ్ను ప్రోత్సహించడానికి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉచిత వాహన సేవలు అందించడానికి ముందుకు వచ్చింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో కొన్ని నవ్వు పుట్టించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాటిలో ఒక్కోసారి చిన్న పేరు తేడా కూడా పెద్ద చిక్కులు తెచ్చిపెడుతుంది. ఇక తాజాగా జరిగిన సంఘటనకు వద్దాం. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.