Home / తెలంగాణ
అయితే ఇప్పటికే షెడ్యూల్ కార్యక్రమాలు ఉన్నందున.. ఆమె గురువారం ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అనే విషయం తీవ్ర ఉత్కంఠగా మారింది.
ఏపీ సీఎం జగన్ సోదరి, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మళ్లీ అరెస్ట్ అయ్యారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ట్యాంక్ బండ్ పై మౌన దీక్షకు దిగారు. మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల వివక్షత ప్రదర్శిస్తుందని ఆరోపిస్తూ..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా.. రాజకీయంగా కూడా సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ మద్యం కేసులో ఈడీ నోటీసులు ఇవ్వడంపై కవిత స్పందించారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ స్పీడ్ పెంచాయి. ఈ కేసులో ఇప్పటికే అరుణ్ పిళ్లైని అరెస్ట్ చేసిన ఈడీ.. తాజాగా ఎమ్మెల్సీ కవిత నోటీసులు ఇచ్చింది. ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే సీబీఐ దర్యాప్తును ఎదుర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత.
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో మహిళా జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, జగదీశ్రెడ్డి, హాజరయ్యారు. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మహిళా పాత్రికేయులను సత్కరించారు.
Delhi Liquor Scam: దిల్లీ లిక్కర్ స్కామ్ లో తాజాగా అరెస్ట్ అయిన అరుణ్ రామచంద్ర పిళ్లై కవితకు బినామీగా వ్యవహరించినట్లు ఈడీ స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు పిళ్లై పనిచేశాడని ఈడీ స్పష్టంచేసింది. ఇటీవల రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులుప్రశ్నించగా తాను ఎమ్మెల్సీ కవిత ప్రతినిధిని అని స్టేట్ మెంట్ ఇచ్చాడు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకటర్రామిరెడ్డిలను పార్టీ నుంచి ప్రతిపాధించారు. ఈ నెల 9న వీరు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
BRS MLC Candidates: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులను కేసీఆర్ ప్రకటించారు.
KTR Comments: హైదరాబాద్ లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఫార్మా పరిశ్రమలకు ఒకే దగ్గర అత్యుత్తమ వసతులను కల్పిస్తున్నామని తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.