Home / ప్రాంతీయం
వారాహి విజయ యాత్ర అనేది అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ వెంట ఉన్నది జనసైనికులు కాదని.. సైకిల్ సైనికులని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ నిజంగా నిజాయితీ పరుడు అయితే.. అవినీతి పరుడైన చంద్రబాబుకు ఎందుకు సపోర్ట్ చేశారని ప్రశ్నించారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్లో మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణకు సీఐడీ నోటీసులు అందించింది. అక్టోబర్ 4వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ స్కామ్లో నారాయణ ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన ఇదివరకే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా ఆయన అరెస్ట్ కు నిరసనగా తెలుగుదేశం పార్టీ నేడు గాంధీ జయంతి సందర్భంగా ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. సత్యమేవ జయతే పేరుతో ఈ దీక్షలను నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం అయిన
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నలపాలెంలోని మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి వద్ద అర్థరాత్రి 11 గంటల తరువాత తీవ్ర ఉద్రికత్త చోటుచేసుకుంది. భారీగా పోలీసులు వారింటివద్ద మోహరించారు. బండారు సత్యనారాయణ మూర్తికి 41 ఏ నోటీసులు ఇచ్చి అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 60 చోట్ల ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. ఏపీలో 40 చోట్ల, తెలంగాణాలో 20 చోట్ల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులకు నిధులు సమకూరుస్తున్నారన్న సమాచారంతో ఎన్ ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. నేడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నారు. ఈ మేరకు వారాహి యాత్ర నాలుగో దశలో భాగంగా ఈరోజు మచిలీపట్నంలోపర్యటించనున్నారు. అందులో భాగంగానే మచిలీపట్నంలో ముందుగా మహాత్మా గాంధీకి పవన్ నివాళులర్పిస్తున్నారు. ఆ తర్వాత వారాహి యాత్రలో భాగంగా.. కృష్ణాజిల్లా కార్యవర్గంతో సమావేశం కానున్నారు.
మహబూబ్నగర్లో పర్యటించిన ప్రధాని మోదీ 13వేల, 500 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. తెలంగాణకు ప్రధాని మోదీ వరాలు ప్రకటించారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క పేరుతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని పాలమూరు సభ సాక్షిగా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తరువాత వచ్చేది జనసేన - తెలుగుదేశం ప్రభుత్వమేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి నాల్గవ విడత యాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం అవనిగడ్డ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటిస్తున్న వేళ బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోస్టర్లు, ఫ్లెక్సీల యుద్ధానికి తెరలేచింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పోస్టర్లు, బ్యానర్లని ఏర్పాటు చేసింది. అలాగే మోదీ తెలంగాణని ప్రతిసారి కించపరుస్తున్నారంటూ ఫ్లెక్సీలు వెలిశాయి.
నేడు ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రధాని మోడీ చేరుకుంటారు. ఒంటిగంట 35 నిమిషాలకు విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మహబూబ్ నగర్ కు వెళ్తారు. మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకు పాలమూరుకు చేరుకుంటారు