Home / ప్రాంతీయం
కృష్ణా జిల్లా పెడన వారాహి యాత్ర సభలో అల్లర్లు రేపేందుకు కుట్ర పన్నారని ఆందోళన వ్యక్తం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రాళ్ళ దాడి చేసేందుకు ప్లాన్ చేశారని చెప్పారు కదా.? దీనికి సంబంధించిన ఆధారాలేమైనా ఉన్నాయా అని నోటీసుల్లో ప్రశ్నించారు. ఆధారాలుంటే ఇచ్చి పోలీసులకి సహకరించాలని పోలీసులు కోరారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఇవాళ క్వాష్ పిటిషన్పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్దార్థ లూథ్రా, అభిషేక్ మను సింఘ్వీ, రాష్ట్ర ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
ప్రధాని మోదీ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గత ఆదివారం నాడు మహబూబ్ నగర్ లో పర్యటించిన విషయం తెలిసిందే. రెండురోజుల వ్యవధిలో తెలంగాణలో ప్రధాని రెండోసారి పర్యటించడం గమనార్హం. ఈ వరుస పర్యటనల నేపధ్యంలో ప్రధాని మోదీ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు.
దేశ వ్యాప్తంగా రోజురోజుకీ నేరాలు ఎక్కువ అవుతున్నాయి.. తప్ప తగ్గడం లేదని సామాన్య ప్రజలు అంతా భావిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటీవల కాలంలో నేర పూరిత ఘటనలు ఎక్కువయ్యాయని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా గత కొన్ని రోజులుగా చిన్నారుల కిడ్నాప్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా తిరుపతి
మూడు రోజుల వ్యవధిలో రెండోసారి వస్తున్న ప్రధాని మోదీకి తెలంగాణ మంత్రి కెటిఆర్ వరుస ప్రశ్నలు సంధించారు. మా మూడు ప్రధాన హామీల సంగతేంటి సార్ అని కెటిఆర్ ప్రశ్నించారు. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం, పోసేదెప్పుడు.. మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు.? మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడని నిలదీశారు.
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా ఏపీ సీఎం జగన్, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు ఆయనను ఆదివారం రాత్రి పోలీసులు అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. ఈ మేరకు ముందుగా విశాఖ జిల్లా పరవాడలో ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు 41A, 41B నోటీసులిచ్చి అరెస్టు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న నాలుగో విడత వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఈ యాత్ర విజయవంతంగా నేడు మూడో రోజు జరుగుతుంది. ఈ మేరకు ముందుగా ప్రకటించిన ప్రకారం.. మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రజలతో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రజల తమ సమస్యలను
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్దమని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తాము పోటీచేసే స్థానాల జాబితాను తాజాగా విడుదల చేసింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడమే తమ పార్టీ
ప్రధాని నరేంద్ర మోదీ రేపు తెలంగాణలోని నిజామాబాద్ లో పర్యటించనున్నారు. నిజామాబాద్ పర్యటనలో ప్రధాని మోడీ మొత్తం రూ.8,021 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని మోదీ ఆదివారం మహబూబ్ నగర్ లో పర్యటించిన విషయం తెలిసిందే. రెండురోజుల వ్యవధిలో తెలంగాణలో ప్రధాని రెండోసారి పర్యటించడం గమనార్హం.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగవ విడత వారాహి యాత్రలో భాగంగా మచిలీపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పింగళి వెంకయ్య, రఘుపతి వెంకటరత్నం నాయుడు