Home / ప్రాంతీయం
ఏపీ ప్రభుత్వం జర్నలిస్టులకు గుడ్న్యూస్ అందించింది. జర్నలిస్టులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల కేటాయింపునకు ఆమోదం లభించింది. ప్రతి జర్నలిస్ట్కు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టున్నారని వైకాపా శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసమే ఎన్నికల నుంచి తప్పుకున్నామని స్పష్టం చేశారు. పోటీకి దూరంగా ఉండాలని తనను కాంగ్రెస్ నేతలు కోరారని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. నేటినుంచి అభ్యర్థులు ఖర్చులను ఎన్నికల కమీషన్ లెక్క గట్టనుంది. అందుకే నోటిఫికేషన్ కు ముందే పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిన దగ్గరి నుంచి నెల రోజుల్లోపు ప్రక్రియ మొత్తం ముగుస్తుంది.
తెలంగాణ ఎన్నికల బరిలో దిగేందుకు సమాయత్తమైన భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. గత వారం రోజులుగా అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు నిర్వహించిన రామచంద్ర యాదవ్ గురువారం 20 మందితో తొలి జాబితాను విడుదల చేశారు.
మహబూబ్నగర్ సీసీఎస్ సీఐ ఇఫ్తికార్ అహ్మద్పై హత్యాయత్నం జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. బుధవారం అర్ధరాత్రి ఈ దాడి జరిగింది. స్థానికంగా ఓ పీఎస్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్.. సీఐపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. తాజాగా బీజేపీ అధిష్టానం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే రెండు విడతల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ.. గురువారం మధ్యాహ్నం 35మందితో కూడిన మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పొత్తులో భాగంగా జనసేనకు కొన్ని సీట్లను కేటాయించింది.
ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీతో పాటు చంద్రబాబు సన్నిహితుల స్థిరాస్తుల అటాచ్మెంట్కు సీఐడీ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాదులో రాజకీయ నేతల ఇళ్లల్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. బడంగ్పెట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ఇంట్లో ఉదయం నుంచి ఐటీ సోదాలు చేస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్కు ఏటీఎంలా మారిందని.. తెలంగాణలో లక్షల కోట్ల ప్రజల సొమ్ము దోపిడీ జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం అంబటిపల్లిలో నిర్వహించిన మహిళా సాధికారత సదస్సులో పాల్గొన్నారు.
చంద్రబాబు ర్యాలీపై హైదరాబాద్లో కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు చంద్రబాబుపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా ర్యాలీ చేయడంతో చంద్రబాబు కేసు నమోదు చేశారు. ఎస్ఐ జయచందర్ ఫిర్యాదుతో క్రైం నంబర్ 531\2023 కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 341, 290, 21