Home / ప్రాంతీయం
గద్వాల చరిత్ర చాలా గొప్పదని అటువంటి గద్వాలను గబ్బు పట్టించిందెవరో ఆలోచించాలని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం గద్వాల లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కరువుతో అల్లాడామని అన్నారు.కాంగ్రెస్ వస్తే కరెంట్ కష్టాలు, కన్నీళ్లు తప్పవని అన్నారు.
నటుడు సాగర్.. మొగలి రేకులు సీరియల్తో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సీరియల్ లో ఆర్కే నాయుడు పాత్రతో ప్రేక్షకులను మెప్పించి అండదరికి చేరువయ్యారు. కాగా పలు సినిమాల్లోనూ క్యారెక్టర్ రోల్స్ పోషించాడు. ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే, ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లో కనిపించిన ఈ యంగ్ హీరో
జనసేన -టీడీపీ కూటమి మేనిఫెస్టో ఓట్లని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. అయితే ఈ రెండు పార్టీలు ఇచ్చే హామీలు ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ఉంటే ఓటర్లని ఆకట్టుకుంటాయి.? ఏ ఆకర్షణతో ఉంటే వైఎస్ఆర్ పార్టీ అనుసరిస్తున్న సంక్షేమానికి మించి మంచి సంక్షేమాన్ని అంద జేస్తాయి అన్నదే కీలక అంశంగా నిలుస్తుందని జోగయ్య సూచించారు.
ఆదివారం ఖమ్మంలోనిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్పై విరుచుకుపడ్డారు. పువ్వాడ ఇప్పటివరకు 4 పార్టీలు మారారని ఆయన తండ్రిని అప్రతిష్టపాలు చేశారని మండిపడ్డారు.
ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఇంఛార్జి అంబర్ పేట శ్రీనివాస్ యాదవ్ "భారత చైతన్య యువజన పార్టీ" లోకి చేరారు. ఆదివారం నాడు హైదరాబాద్ లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బొడే రామ చంద్ర యాదవ్ గారు శ్రీనివాస్ యాదవ్ ను పార్టీ లోకి ఆహ్వానించారు.
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో బస్సు ప్లాట్ 12వ నెంబర్ ప్లాట్ ఫామ్ పైకి దూసుకువెళ్లింది. దీంతో పలువురు ప్రయాణికులు పైకి బస్సు వెళ్లడంతో చక్రాల కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరికొంతమందికి గాయాలు అయ్యాయి.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమితులైన తర్వాత పురంధేశ్వరి వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తోంది.జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి నిందితుడనే విషయం అందరికి తెలిసిందే .జగన్ తో పాటు జైలు జీవితం కూడా అనుభవించారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై వున్నారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్ ఫాజిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఒక హోటల్ లో తుపాకీతో పాయింట్ బ్లాంక్ లో కాల్చుకొని సూసైడ్ కు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతూనే అతను కాల్చుకున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. ఏ పార్టీ చరిత్ర ఏంటో ప్రజలు బాగా ఆలోచించాలి. మీ ఓటు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం, కొత్తగూడెం లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగించారు.
జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ ఛైర్మన్ డా.లక్ష్మణ్ పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది.