Home / ఆంధ్రప్రదేశ్
కాకినాడ జిల్లా పెద్దాపురంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎవరి హయంలో అవినీతి జరిగిందనే అంశంపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ దొరబాబుల నేతలు పరస్పరం సవాళ్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ, టీడీపీ నేతలు.. లై డిటెక్టర్ టెస్టు, బహిరంగ చర్చ కోసం
ఏపీ లోని విశాఖపట్నం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెందుర్తి లోని సుజాతనగర్ లో బంగారం కోసం 72 ఏళ్ల వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. సుజాతనగర్ సచివాలయంలో వాలంటీర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి పార్ట్ టైంగా చికెన్ షాప్ లో జాబ్ చేస్తున్నాడు.
ఇంతకాలం బీజేపీలో ఉన్నా పురంధేశ్వరిని పెద్దగా పట్టించుకోని వైఎస్ఆర్సిపి నేతలు ఆమె అధ్యక్షురాలైన తరువాత వరుసగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇంతకాలం ఆమె పట్ల కాస్త మర్యాదగా మాట్లాడిన ఫ్యాను పార్టీ నేతలు ఇప్పుడు డోసు పెంచారు. ఇటీవలి కాలంలో ఏపీలోని ముఖ్య పట్టణాలకి వెళుతూ మీడియా సమావేశాల్లో పురంధేశ్వరి వైఎస్ఆర్సిపిపై విరుచుకు పడుతున్నారు. అంతే ఘాటుగా వైఎస్ఆర్ మంత్రులు స్పందిస్తున్నారు.
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురంలో కోళ్లు దొంగిలించారన్న అనుమానంతో ముగ్గురు వ్యక్తులను స్థానిక వైకాపా కార్యకర్తలు విచక్షణారహితంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారిలో ఒక దళిత బాలుడిని కొట్టడమే కాకుండా కులం పేరుతో దూషించి.. కటింగ్ప్లేయర్తో మర్మాంగాలను నొక్కిపట్టి..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆయన మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. నిన్న గ్రాండ్ గా రిలీజయింది. తమిళంలో మంచి విజయం సాధించిన వినోదయ సితం సినిమాకు బ్రో రీమేక్గా వచ్చింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి రేపు ఉదయం 6.30 గంటలకు PSLV C-56 రాకెట్ను ప్రయోగించనున్నారు. ఇక, దీనికి సంబంధించిన కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్ కు, పోలవరానికి పట్టిన శని చంద్రబాబు నాయుడేనని ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వరదల వల్ల దెబ్బతిన్న పోలవరం డయాఫ్రమ్ వాల్ ను నిపుణులు పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు తమ హయాంలో పోలవరం పనులు 75 శాతం చేసామని చెప్పారని కాని అది అబద్దమన్నారు.
తెలంగాణ హైకోర్టులో రిటైర్ట్ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం రిట్ పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసుకి సంబంధించి సీబీఐ పేర్కొన్న స్టేట్మెంట్లో అన్నీ అబద్దాలే ఉన్నాయని అజయ్ కల్లం పిటిషన్లో తెలిపారు. 2023 ఏప్రిల్ 29న సీబీఐ తన స్టేట్మెంట్ రికార్డు చేసిందని అజయ్ కల్లం చెప్పారు.
తెదేపా మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య ప్రియ సంచలన ఆరోపణలు చేశారు. నారాయణ ఒక డేగలా తనపై కన్నేశారని ఆమె అన్నారు. ఓ పిట్టను డేగ ఎత్తుకెళ్లినట్టు తన పరిస్థితి మారిందని చెప్పారు. మోసపోయిన పిట్టను తానేనని వ్యాఖ్యానించారు. నారాయణ తనను చిత్రహింసలకు గురిచేసేవారని ఆరోపించారు.
ప్రతి ఏడాది ఎంతో ఘనంగా మతసామరస్యానికి అద్దం పట్టేలా.. నిర్వహిస్తున్న నెల్లూరులో రొట్టెల పండుగ ఇవాళ్టి నుంచి ప్రారంభం అయ్యింది. ఈ మేరకు నెల్లూరు లోని స్వర్ణాల చెరువు, బారాషహీద్ దర్గా వద్ద ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఈ పండుగలో పాల్గొనేందుకు.. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.