Home / తాజా వార్తలు
భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్గా అభివృద్ధి చేసిన రాకెట్, విక్రమ్-ఎస్ శుక్రవారం శ్రీహరికోట స్పేస్పోర్ట్లోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుండి ఉప-కక్ష్య మిషన్లో విజయవంతంగా ప్రయోగించబడింది.
మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకుఅనారోగ్యం వస్తే డోలీ కట్టి, మంచాలపై పడుకోబెట్టి కొండల్లో, గుట్టల్లో అటవీ ప్రాంతం గుండా తీసుకువెళ్తుంటారు.
అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలులో గూడూరు జంక్షన్ సమీపంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
మీడియా కలుషితం అయ్యిందని నిందిస్తూ, దాన్ని అదేపనిగా ప్రచారం చేస్తూ కూర్చోకుండా ప్రతి విద్యావంతుడు సమాచార వ్యాప్తిలో సత్యానికి కట్టుబడి ఉండాలని సీనియర్ జర్నలిస్టు, జర్నలిజం బోధకుడు డాక్టర్ ఎస్. రాము హితవు పలికారు.
తెలంగాణ వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కంటి వెలుగు కార్యక్రమ అమలు తీరు, ప్రజారోగ్యం వైద్యం అంశాల పై, సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఫైనాన్స్ మినిస్టర్ అప్పు చెయ్యకపోతే ఎవరు చేస్తారు ? హోమ్ మంత్రి చేస్తారా అంటూ ఏపీ ఆర్దికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనలో చేసిన విమర్శల పై ఆయన స్పందించారు.
సూపర్స్టార్ కృష్ణకు ఘననివాళులర్పించేందుకు ఆయన కుటుంబసభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన గుర్తుగా ఓ మెమెరియల్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు మహేష్ బాబు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారట.
ఢిల్లీలో తనతో సహజీవనం చేస్తున్న మహిళ శ్రద్ధా వాకర్ ను దారుణంగా హతమార్చిన హంతకుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా పోలీసుల విచారణలో తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఆమె తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో శ్రద్ధను చంపినట్లు అంగీకరించాడు.
నోయిడా నగరంలోని రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లిఫ్ట్లో పెంపుడు కుక్క 6 ఏళ్ల చిన్నారిని కరిచినందుకు గ్రేటర్ నోయిడా అథారిటీ పెంపుడు యజమానికి రూ.10,000 జరిమానా విధించింది.
2024 ఎన్నికలు తనకు చివరి ఎన్నికలని చంద్రబాబు చెప్పినట్టుగా జరుగుతుందని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మనం మంచి కోరుకుంటే మంచి, చెడు కోరుకుంటే చెడు జరుగుతుందన్నారు.