Home / తాజా వార్తలు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న మంత్రి స్టేజ్ పై ఉండగానే శరీరంలో చక్కెర శాతం పడిపోవడంతో కాస్త ఇబ్బంది పడ్డారు.
చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక సోదరుడు యుగంధర్ ఈడీ విచారణకు హాజరయ్యారు.
ఒక్క సైకిల్ పై మహా అంటే ఇద్దరు కూర్చోగలరు ఒకరు ముందు మరొకరు వెనుక కానీ ఒక సైకిల్ పై తొమ్మిది మంది కూర్చోవడం ఎక్కడైనా చూశారా లేదు కదా అయితే ఈ క్రింద వీడియో చూస్తే మీరు షాక్ అవుతారు.
ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం తరచూ రిపేర్లకు గురవుతోందని అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్లలేకపోతున్నానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి మస్క్ అనేక రకాల మార్పులు చేర్పులతో అటు ఉద్యోగులకు ఇటు యూజర్లకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇకపోతే తాజాగా ట్విట్టర్ 2.0ను నిర్మించేందుకు ఉద్యోగులు అహర్నిశలు శ్రమించాలని సుదీర్ఘ పనిగంటలు చేయాల్సి ఉంటుందని ఆయన ట్విట్టర్ ఉద్యోగులకు తెలిపారు.
అగ్ని ప్రమాదాలను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇస్తూ సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వాటి నిర్వహణకు అవసరమైన 382 ఉద్యోగాలను కూడా మంజూరుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
మానవజీవితంపై స్మార్ట్ ఫోన్లు ఎంతటి ప్రభావాన్ని చూపుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నపిల్లల నుంచి పండుముసలి వరకు సెల్ ఫోన్లను విరివిగా వాడుతున్నారు. దీనితో భవిష్యత్ తరాల మనుగడకు ప్రశ్నార్ధకంగా మారుతుందని భావిస్తూ కొన్ని గ్రామాల ప్రజలు దీని వినియోగంపై ఆంక్షలు పెట్టారు. కాగా మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ ప్రాంతంలోని యవత్మాల్ జిల్లాలోని ఒక గ్రామం 18 ఏళ్లలోపు వారు మొబైల్ ఫోన్లను ఉపయోగించడాన్ని నిషేధించింది.
పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఒక వినూత్న వీడియోను షేర్ చేసారు. ఇది ఎల్పిజి సిలిండర్లను క్యూఆర్ కోడ్లతో ఎలా పొందుపరచబడుతుందో చూపిస్తుంది. తద్వారా వాటిని ట్రాక్ చేయవచ్చు.
ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనా ఆటగాడు డిగో మారడోనా 1986 ప్రపంచకప్లో ఇంగ్లాండ్ జట్టుతో క్వార్టర్స్లో కొట్టిన ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ ఎంత ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. కాగా మారడోనా కొట్టిన ఆ బంతిని తాజాగా నిర్వహించిన వేలంలో దాదాపు 2.4 మిలియన్ డాలర్లు అనగా మన కరెన్సీలో రూ. 19.5 కోట్లకు అమ్ముడుపోయింది.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్నాథ్ జన్మదిన వేడుకల కోసం సిద్ధం చేసిన కేక్ ఆలయం నమూనాలో ఉండటం, దానిపై హనుమంతుడి చిత్రం ఉండటంపై వివాదం చెలరేగింది.