Last Updated:

Bigg Boss 6 : ఆదిరెడ్డి – గీతూ ప్లాన్ మామూలుగా లేదుగా !

మధ్య మధ్యలో బిగ్‌బాస్ ఇచ్చే ఛాలెంజ్లో గెలిచిన సభ్యులు తమ వద్ద ఉన్న చేపల సంఖ్యని పెంచుకోవచ్చు.ప్రతి ఛాలెంజ్‌లో పోటీపడే అవకాశాన్ని దక్కించుకోవాలంటే హారన్ మోగినప్పుడు ప్రతి జంటలో ఒకరు గార్డెన్‌ ఏరియాలో ఏర్పాటు చేసిన పూల్లో దిగి అందులో ఉన్న గోల్డ్ కాయిన్‌ని వెతకాలి.

Bigg Boss 6 : ఆదిరెడ్డి – గీతూ ప్లాన్ మామూలుగా లేదుగా !

Bigg Boss 6 : కెప్టెన్సీ రేసులో నిలిచేందుకు బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ‘చేపల చెరువు’ అనే టాస్క్ ఇచ్చాడు.ఈ టాస్క్‌లో ఇంటి సభ్యులు జంటలుగా విడిపోయి గార్డెన్ ఏరియాలో కురిసే చేపల వర్షంలో చేపల్ని పట్టుకుని జాగ్రత్త చేయాలిసి వచ్చింది.ప్రతి రౌండ్‌ ముగిసిన తర్వాత బిగ్‌బాస్ అడిగినప్పుడు తక్కువ చేపలు ఉన్న జంట ఈ టాస్క్ నుంచి బయటకు వెళ్ళాలీ.మధ్య మధ్యలో బిగ్‌బాస్ ఇచ్చే ఛాలెంజ్లో గెలిచిన సభ్యులు తమ వద్ద ఉన్న చేపల సంఖ్యని పెంచుకోవచ్చు.ప్రతి ఛాలెంజ్‌లో పోటీపడే అవకాశాన్ని దక్కించుకోవాలంటే హారన్ మోగినప్పుడు ప్రతి జంటలో ఒకరు గార్డెన్‌ ఏరియాలో ఏర్పాటు చేసిన పూల్లో దిగి అందులో ఉన్న గోల్డ్ కాయిన్‌ని వెతకాలి.

ఇంటి సభ్యుల్లో వీరు జంటలుగా ఆడారు
సూర్య- వసంతి,రేవంత్- ఇనయ, శ్రీహాన్- శ్రీసత్య , బాలాదిత్య -మెరీనా , ఆదిరెడ్డి -గీతు, రోహిత్ -కీర్తి, రాజ్- పైమా

టాస్క్‌లో ఫిజికల్‌గా రేవంత్‌తో పోటీపడలేమని ముందే నిర్ణయం తీసుకున్న గలాట గీతు ప్లాన్ ప్రకారం రేవంత్‌ని రెచ్చగొట్టాలని ముందే ఆదిరెడ్డికి సూచించింది.రేవంత్ రెచ్చిపోతే.. అప్పుడు ఇనయ చేపల్ని ఏరలేకపోతుందని గీతు మేడమ్ గారు ఈ విధంగా ప్లాన్ చేశారు.వాసంతి నుంచి చేపల్ని దొంగలించే ప్లాన్లో గీతు విఫలం అయింది.కానీ సూర్య అడ్డుకోవడం వలన ఆదిరెడ్డిని బ్లాక్ చేసి ఇంటి సభ్యులు గీతు నుంచి కొన్ని చేపల్ని దొంగలించారు.మొత్తానికి చేపలు టాస్క్ అలా కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి: