Home /Author
ఐదు వంటనూనెల రిటైల్ ధరలు మస్టర్డ్ ఆయిల్, వనస్పతి, సోయా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ మరియు పామాయిల్ గత నెలతో పోలిస్తే 2–8% తగ్గాయి, అయితే ఇప్పటికీ గత ఏడాదికంటే 3–21% ఎక్కువగా ఉన్నాయి.
భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు బక్రీద్ ను తమ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటారు. కుటుంబ సభ్యులనే కాకుండా తమ స్నేహితులను కూడ విందుకు ఆహ్వానిస్తారు. ఈ సందర్బంగా మెనూలో ఉండే సంప్రదాయ వంటకాల జాబితా ఇక్కడ ఉంది.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా పెరిగిపోయింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. నిరసనకారులు కొలంబోలోని రాజపక్స ఇంటిని చుట్టుముట్టారు. దీంతో గొటబాయ వారినుంచి తప్పించుకుని పరారయ్యారు. ఆందోళనకారులపై లంక సైన్యం టియర్ గ్యాస్ ప్రయోగించింది.
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్కు సమీపంలో ఉన్న సోవెటో టౌన్షిప్లోని బార్లో జరిగిన కాల్పుల్లో 14 మంది మరణించారని పోలీసులు ఆదివారం తెలిపారు.శని వారం అర్దరాత్రి 12 గంటలకు తమకు దీనిపై సమాచారం అందిందని తెలిపారు.
కోర్టు ధిక్కరణ కేసులో కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు రేపు శిక్ష ఖరారు చేయనుంది. 2017లో విజయ్ మాల్యా కోర్టు ఆదేశాలను దిక్కిరించారు. కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా 40 మిలియన్ డాలర్లను తన పిల్లల పేరున బదిలీ చేశారు. అయితే ఈ కేసులో తమ ఎదుట హాజరు కావాలని పలుమార్లు కోరినప్పటికీ ఆయన హాజరు కాలేదు.
వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి ఉంటుంది. .సహోద్యోగులతో విభేదాలకు అవకాశం ఉంది. వివాదాలకు దూరంగా వుండాలి.ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేయడం మంచిది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఏవిషయమైనా కుటుంబసభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిది.
దేశవ్యాప్తంగా ముస్లింలు నేడు బక్రీద్ పండుగును భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే జంతువని, ఈద్ అంటే పండుగని అర్థాలు ఉన్నాయి. జంతువును ఖుర్బాని ( దానం ) ఇచ్చే పండుగ కాబట్టి దీనిని ఈదుల్ ఖుర్బాని అని కూడా అంటారు.
మారేడుపల్లి సీఐ నాగేశ్వర్ రావు సస్పెండ్ అయ్యారు. అత్యాచారం, ఆయుధ చట్టం కింద సీఐ నాగేశ్వర్ రావుపై కేసు నమోదయింది. దీనితో నాగేశ్వర్ రావును విధుల నుంచి తప్పిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. బక్రీదు, బోనాల పండుగ బందోబస్తు దృష్ట్యా కార్ఖానా సీఐ నేతాజీని మారేడుపల్లి ఇంచార్జీ సీఐగా సీవీ ఆనంద్ నియమించారు.
కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. చెన్నైలోని నుంగంబాకం ఇంట్లో ఆరుగురు సీబిఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. గతంలో ఓ సారి కార్తీ చిదంబరం ఇంటిపై దాడి చేసినప్పుడు ఆ గదికి తాళాలు వేసి ఉన్నాయి. దాని తాళం చెవులు మాత్రం కార్తీ వద్దనే ఉన్నాయి. అప్పుడు ఆయన లండన్ ఉన్నారు.
కజకిస్థాన్ కు చెందిన ఎలీనా రైబాకినా వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరడం ఆమెకు ఇదే తొలిసారి కాగా, అద్భుతమైన ఆటతీరుతో ట్యునీషియాకు చెందిన ఆన్స్ జాబెర్ ను ఓడించింది.