Home /Author anantharao b
సంచలన దర్శకుడు పూరి జగన్నాధ్ తన కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ట్రోల్ మరియు విమర్శలకు గురవుతున్నాడు. అతని ఇటీవలి చిత్రం లైగర్ ప్లాప్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు పెద్ద మొత్తంలో నష్టపోయారు. ఈ సినిమా ఫైనల్ రన్లో భారీ వసూళ్లను రాబడుతుందని పూరీ, విజయ్లు అంచనా వేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 1న జల్సా సినిమా రీ-రిలీజ్ అయిన విషయం తెలిసిందే. పవన్ పుట్టినరోజును ఘనంగా జరుపుకునేందుకు అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా స్పెషల్ షోలు వేస్తున్నారు.
వరుసగా ఆరు నెలలుగా జీఎస్టీ ఆదాయం రూ.1.4 లక్షల కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఆగస్టు నెలలో రూ.1,43,612 కోట్లు జీఎస్టీ వసూలు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది ఇదే నెలలో వచ్చిన జీఎస్టీ ఆదాయాల కంటే 28 శాతం ఎక్కువ ఆదాయం వచ్చిందని పేర్కొంది.
దేశమంతటా గణేష్ చతుర్ది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గోవాలోని ఒక కుటుంబానికి చెందిన సభ్యులు కూడ అందరూ ఒక చోట చేరి ఈ పూజను చేసుకున్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ పూజకు ఏకంగా 250 మంది కుటుంబ సభ్యలు హాజరయ్యారు. వారు ఉంటున్న భవనం 288 ఏళ్ల నాటిది.
ఇండోర్కు చెందిన యష్ సోనాకియా గ్లాకోమావ్యాధి కారణంగా ఎనిమిదేళ్ల వయసులో పూర్తిగా కంటి చూపును కోల్పోయాడు, అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనే అతని కలనుంచి అతడు వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ అతనికి దాదాపు రూ.47 లక్షల వార్షిక ప్యాకేజీని ఆఫర్ చేసింది.
200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కుంభకోణంలో సుకేశ్ చంద్రశేఖర్తో పాటు ఇతరులకు సంబంధించిన కేసులో సెప్టెంబరు 26న హాజరు కావాలని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరింది. ఈ కేసులో అనుబంధ చార్జిషీట్ను కూడా ఏజెన్సీ దాఖలు చేసింది.
ఆదాయపు పన్ను శాఖ కోల్కతాకు చెందిన ప్రముఖ బిజినెస్ గ్రూప్ పై సోదాలు మరియు జప్తు ఆపరేషన్ నిర్వహించింది. ఈ సందర్బంగా లెక్కల్లో చూపని రూ. 250 కోట్లు ఆదాయాన్ని గుర్తించింది.
ఆస్ట్రేలియాలోని ఒక కుటుంబానికి వారి బ్యాంక్ అక్కౌంటులో పొరపాటున $100కి బదులుగా $10.4 మిలియన్లు జమకావడంతో వారికి ఇబ్బందులు మొదలయ్యాయి. దీనితో ఇపుడు వారు ఖర్చు చేసిన ప్రతి పైసాను తిరిగి చెల్లించాలి.
ఐదు రాష్ట్రాల్లోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.4,189 కోట్లువిడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. కర్ణాటక (రూ. 628.07 కోట్లు), త్రిపుర (రూ. 44.10 కోట్లు), ఉత్తర ప్రదేశ్ (రూ. 2,239.80 కోట్లు), ఆంధ్రప్రదేశ్ (రూ. 569.01 కోట్లు), గుజరాత్ (రూ. 708.60) లకు కేంద్రం ఈ గ్రాంట్లు విడుదల చేసింది.
తెలంగాణలోని నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి పై పంజాగుట్ట పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. శివకుమార్ రెడ్డి తనకు మద్యం తాగించి, నగరంలోని ఓ హోటల్ లో తనపై అత్యాచారం చేశారని, ఆ తర్వాత అదంతా రికార్డు