Home /Author anantharao b
తెలంగాణ ప్రభుత్వం కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల కాన్పులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. రోజుకు 10 నుంచి 15 ఆపరేషన్లు మాత్రమే చేసేలా కొత్త నిబంధన విధించింది.
సోనాలి పోగాట్ హత్య జరిగి సుమారు పది రోజులు కావస్తోంది. విచారణలో కొత్త కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. అయితే హత్యకు గల కారణాలపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. పోలీసులు మాత్రం దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రస్తుతం సోనాలి హత్యకు ప్రధాన కుట్రదారుడు మాత్రం ఆమె పీఏ సుధీర్ సాంగ్వాన్.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అవిశ్వాస పరీక్షలో నెగ్గారు. సభలో 59 మంది సభ్యలు అయనకు అనుకూలంగా ఓటు వేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ సీబీఐ మనీష్ సిసోడియాపై ఫేక్ లిక్కర్ కేసు నమోదు చేసి దాడులు చేసినప్పటి నుంచి గుజరాత్లో ఆప్కు నాలుగు శాతం వోట్ షేరు పెరిగిందని, ఒక వేళ ఆయనను అరెస్టు
బాలీవుడ్ యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్ ఇటీవల ప్రముఖ చాట్ షో 'కాఫీ విత్ కరణ్' యొక్క 9వ ఎపిసోడ్లో కనిపించాడు. దిశా పటానీతో తనకు ఎలాంటి సంబంధం ఉంది అనే దాని గురించి మాట్లాడాడు. వీరిద్దరూ కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్నారని పుకార్లు ఉన్నాయి.
కేసీఆర్ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీలను ఏకం చేస్తానని కేసీఆర్ చెబుతున్నారని, అందరూ తన వెనుక ఉన్నారనే భ్రమలో కేసీఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు. జాతీయస్థాయిలో కేసీఆర్ గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నారని, అయితే అది అంత సులభం కాదన్నారు.
ఎన్డీఏలో చేరిక అంశం పై ఇప్పుడేం స్పందించనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ ప్రయోజనాల కోసమే ఏన్డీఏ నుంచి బయటకు వచ్చామని, ఏపీ ప్రయోజనాల కోణంలోనే కేంద్ర రాజకీయాలను చూస్తాంమని చెప్పారు.
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం తన పుట్టినరోజును జరుపుకోనున్నారు. దీనితో 'హరి హర వీర మల్లు' బృందం పవర్స్టార్ అభిమానులందరికీ పుట్టినరోజు బహుమతిని ఇచ్చింది. పవన్కి సంబంధించిన సరికొత్త పోస్టర్ను షేర్ చేస్తూ నిర్మాతలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
రామ్ చరణ్ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో సినిమా కోసం చర్చలు జరుపుతున్నాడని, నెలరోజుల క్రితం అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఈ చిత్రం ఆగిపోయింది. చరణ్ ప్రాజెక్ట్ ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందనే దానిపై చాలా అంచనాలు ఉన్నాయి.
నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం రెండు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నాడు. అవి రామ్ చరణ్ - శంకర్ చిత్రం మరియు విజయ్ - వంశీ పైడిపల్లి చిత్రం. దిల్ రాజు ప్రభాస్ కోసం పెద్ద మొత్తంలో అడ్వాన్స్ చెల్లించాడు. అయితే ప్రభాస్ రాబోయే మూడు సంవత్సరాలు కూడ బిజీగా ఉన్నాడు.
అల్లు అర్జున్ నటించిన 'పుష్ప: ది రైజ్' విడుదలై ఏడాది అవుతున్నా ఇంకా వార్తల్లోనిలుస్తోంది. ఇటీవలే మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడి అంతర్జాతీయ వేదికపై సందడి చేసింది. ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రపంచవ్యాప్తంగా 'బ్లాక్ బస్టర్స్' కేటగిరీ కింద ఈ చిత్రం ప్రదర్శించబడింది.