Home /Author anantharao b
భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు తెలంగాణలో పర్యటించనున్న నేపధ్యంలో రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపుమధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆంక్షలు ఉండనున్నాయి. పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, ప్రకాష్ నగర్, రసూల్పుర, ప్యాట్నీ సిగ్నల్ వరకు ట్రాఫిక్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది.
రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ మార్పులపై రెండు రోజుల్లో గ్రామ సభలు నిర్వహించి సవరణలపై రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇరాన్లో మత గురువులు ఎక్కడ కనిపిస్తే అక్కడ నిలదీస్తున్నారు మహిళలు. మూటముల్లె సర్దుకొని దేశం విడిచిపోవాల్సిందిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీ వల్ల దేశం పూర్తిగా నాశనమైపోయిందని శాపనార్థాలు పెడుతున్నారు. తలపాగాతో కనిపించే ముస్లిం మత గురువుల పాగాలను లాగేస్తున్న వీడియోలు షోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
వాతావరణ కాలుష్యం తగ్గించడానికి యూఎన్ క్లయిమేట్ సమ్మిట్ ఈజిప్టులో జరుగుతోంది. ఈ సమ్మిట్ ఈజిప్టులోని బీచ్ రిసార్ట్ ప్రాంతమైన షార్మ్ ఎల్ షేక్లో జరుగుతోంది. ఈ సదస్సులో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో శాస్ర్తవేత్తలు సూచిస్తారు.
వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు సముదాయంలో కనుగొనబడిన 'శివలింగం' పరిరక్షణ కోసం గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం పొడిగించింది.
సానియా మీర్జా మరియు షోయబ్ మాలిక్ విడిపోయారనే వార్తల మధ్య, ఆయేషా ఒమర్ అనే పాకిస్థాన్ నటి చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్పై విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)నిందితులు రూ.1.20 కోట్ల విలువైన 140 ఫోన్లను మార్చి సాక్ష్యాలను ధ్వంసం చేసి అరెస్టు నుంచి తప్పించుకున్నారని ఆరోపించింది.
పశ్చిమ బెంగాల్లో కోట్లాది రూపాయల పశువుల అక్రమ రవాణా కుంభకోణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.
రుషి కొండలో అక్రమంగా ప్రభుత్వం తవ్వకాలు చేస్తోందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ప్రతి చిన్న విషయం సుప్రీంకోర్టే తేల్చాలంటే ఎలా అని పిటిషనర్ను దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
పదవుల నుంచి సంక్షేమ పథకాల వరకు అన్ని విధాలుగా మైనార్టీలకు న్యాయం చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. గుంటూరులో జరిగిన మైనారిటీ సంక్షేమదినోత్సవంలో ఆయన మాట్లాడుతూ ఒక మైనారిటీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చామని అన్నారు.