Home /Author anantharao b
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవన్న సెక్స్ కుంభకోణం గురించి యావత్ దేశం చర్చించుకుంటోంది. లోకసభ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజ్వల్ శనివారం ఉదయం ఫ్రాంక్ఫర్ట్వెళ్లి పోయారు. ఆదివారం నాడు ప్రజ్వల్ కు చెందిన సుమారు 3వేల వీడియోలు కర్ణాటకలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ప్రజ్వల్ తండ్రి హెచ్డీ రేవన్న మాత్రం తన కుమారుడిని వెనకేసుకు వస్తున్నారు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్ణాటక అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని దోపిడీ గ్యాంగ్ నడిపిస్తోందన్నారు. బెంగళూరు టెక్ హబ్.. దీన్ని కాస్తా కాంగ్రెస్ పార్టీ ట్యాంకర్ హబ్ గా మార్చిందని మండిపడ్డారు. కర్ణాటకలో 2జీ స్కామ్ లాంటి కుంభకోణాలు చేయాలని కలలు కంటున్నారని ప్రధాని మోదీ రాష్ర్టంలోని బాగల్ కోట్లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ అన్నారు.
కెనడాలో సిక్కుల హవా ఎలా నడుస్తుందో చెప్పడానికి ఇదో చక్కటి ఉదాహరణ. అక్కడ ప్రభుత్వం బతికి బట్టకట్టాలంటే సిక్కుల మద్దతు తప్పనిసరి. అయితే ఆదివారం టోరంటోలో ఖల్సా డే సంబరాలు జరిగాయి. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో సమక్షంలో ఖలిస్తాన్కు అనుకూలంగా.. అలాగే ప్రతిపక్ష నాయకుడు పియర్ పోయిలీవ్రేకు మద్దతుగా నినాదాలు చేశారు
కర్ణాటకలో ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ దుమారం చెలరేగుతోంది. దీనికంతటికి కారణం మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవగౌడ్ మనవడు ప్రజ్వల్ రెవన్న సెక్స్ స్కాండిల్లో కూరుకుపోవడమే. ప్రజ్వల్ అసభ్యకరమైన క్లిప్స్ ప్రస్తుతం కర్నాటకలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి. దీంతో పాటు ఓ మహిళ కూడా జెడి ఎస్ నాయకుడు ప్రజ్వల్ తండ్రి హెచ్డీ రెవన్న తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసు ఫిర్యాదు చేశారు
హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్టులోకి చిరుత చొరబడడంతో కలకలం రేగింది. గొల్లపల్లి వైపు నుంచి ప్రహరీగోడ దూకి చిరుత ఎయిర్పోర్టు లోపలికి వచ్చిందని తెలుస్తుంది .ఏప్రిల్ 28 తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది . చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
విశాఖ పోర్టులో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నిర్మించిన తర్వాత తొలిసారిగా ఒక అంతర్జాతీయ ప్రయాణికుల నౌక విశాఖ చేరుకుంది. ఏప్రిల్ 28 న 80మంది ప్రయాణికులతో 'ది వరల్డ్' అనే క్రూయిజ్ షిప్ పోర్టు లోని ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ కు చేరుకుంది .' ఈ నౌక లగ్జరీ విభాగానికి చెందినది.
తెలుగుదేశం యువనేత జనరల్ సెక్రటరీ నారా లోకేష్ మరోసారి యువగళం యాత్ర చేపట్టనున్నారు. గతంలో కుప్పం నుంచి విశాఖ వరకు యువగళం పాదయాత్ర ద్వారా శ్రేణుల్లో నూతనోత్తేజం నింపిన లోకేష్ ... ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో మిగిలిన ప్రాంతాలలో పర్యటించనున్నారు . ఏప్రిల్ 30 న ఒంగోలు నుంచి మలివిడత యువగళం యాత్ర ప్రారంభించి మే 6న ముగించనున్నారు.
ఏపీలో ఎన్నికల నేపధ్యంలో అనేక విషయాలపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య విమర్శ ప్రతివిమర్శలు పొడచూపుతున్నాయి .తాజాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విస్తృత మైన చర్చ జరుగుతోంది. ఆ చట్టం ద్వారా రైతుల భూములు, ఆస్తులు లాక్కునేందుకు కుట్రపన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 29 న ఈ చట్టం పై రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు.
తెలంగాణాలో బీఆర్ఎస్ మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్రెడ్డి కాంగ్రెస్పార్టీ లో చేరారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్ను జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో అమిత్రెడ్డి కలిశారు.
చంద్రబాబుని నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టినట్లేనని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. జరగబోయే ఎన్నికలు ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునేవి మాత్రమే కాదు.. ఇంటింటి అభివృద్ధి, పేదల తలరాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.