Home /Author anantharao b
తెలంగాణలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారయ్యింది. ఈ నెల 15న హుస్నాబాద్లో తొలి బహిరంగ సభ జరగనుంది. అనంతరం ఈ నెల 16 నుంచి నవంబర్ 9 వరకు పర్యటించనున్నారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల తేదీని సవరించింది ఎన్నికల కమిషన్. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 23న జరగాల్సిన ఎన్నికలు తేదీని సవరించినట్టు భారత ఎన్నికల కమిషన్ బుధవారంనాడు ప్రకటించింది. నవంబర్ 25న ఎన్నికలను నిర్వహించనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ వర్గాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్ ను సవరణ చేసినట్టు పేర్కొంది.
ఏపీలో 175 స్థానాలు గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు మంత్రి అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఇంట్లో నేడు వైసీపీ నాయకులు భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మిర్చి యార్డు చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్ లు భేటీ అయి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఉదయం పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లాలో నాలుగు చోట్ల రైస్ మిల్లుల్లో సోదాలు నిర్వహించింది. ఉద్యోగాల కుంభకోణంపై కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఈ సోదాలు నిర్వహించినట్లు ఒక అధికారి తెలిపారు.
ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సిఆర్ఎ)ని ఉల్లంఘించినందుకు గాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ ) బుధవారం న్యూస్క్లిక్ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. ఈ సంస్దపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారి తెలిపారు.
భారత్కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరైన, పఠాన్కోట్ దాడికి సూత్రధారి అయిన షాహిద్ లతీఫ్ పాకిస్థాన్లో హతమయ్యాడు. సియాల్కోట్లో గుర్తు తెలియని సాయుధులు అతడిని కాల్చిచంపినట్లు సమాచారం. షాహిద్ లతీఫ్ భారతదేశంలో చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద అభియోగాలు ఎదుర్కొంటున్నాడు.
ఇజ్రాయెల్ మరియు హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం ఐదవ రోజుకు చేరుకోగా ఇరు వైపులా మరణించిన వారి సంఖ్య 3,000 దాటింది. ఇజ్రాయెల్వైమానిక దాడులతో పాటు గాజాలో భూదాడిని ప్రారంభించడం ద్వారా దాడిని ఉధృతం చేయడానికి సిద్ధమవుతోంది. భారీ సైనిక సామగ్రితో పాటు రిజర్వ్ దళాలకు చెందిన మరింత మంది సభ్యులను కూడా పిలిపించారు.
ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి తక్షణం ఏవైతే అవసరమో వాటిని రాబోయే ఎన్నికల మ్యానిఫెస్టోలో టీడీపీ, జనసేన మిశ్రమ ప్రభుత్వం అమలు జరిపేలా తమ వంతు ప్రయత్నం చేస్తామని మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామజోగయ్య తెలిపారు.
హైదరాబాద్ గాంధీ భవన్లో టికాంగ్రెస్ పీఏసి సమావేశమైంది. కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ థాక్రే, ఏఐసీసీ ఇంచార్జ్ కార్యదర్శులు, పీఎసి సభ్యులు హాజరయ్యారు. ఈ నెల 15 నుండి ప్రారంభించాలనుకుంటున్న బస్సు యాత్ర షెడ్యూల్ ,రూట్ మ్యాప్ పై చర్చించారు.
ఇజ్రాయెల్పై హమాస్ చేసిన మెరుపుదాడిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటికే ఖండించిన విషయం తెలిసిందే. హమాస్ దాడి చేసిందన్న విషయం తెలిసిన కొన్ని గంటల్లోనే ఆయన ట్విటర్ ద్వారా దాడిపై స్పందించారు.