Home /Author anantharao b
రాజ్యసభ నుంచి తనను సస్పెండ్ చేయడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా సుప్రీంకోర్టులో మంగళవారంనాడు సవాలు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన కింద రాఘవ్ చద్దాపై నలుగురు ఎంపీలు ఫిర్యాదు చేయడంతో ఆగస్టు 11న ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది.
కాంగ్రెస్ పార్టీతో మరియు తన పనిలో బిజీగా ఉండటం వలనే తాను పెళ్లి చేసుకోలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జైపూర్లోని మహారాణి కళాశాల విద్యార్థులతో రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియోను మంగళవారం తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విడుదల చేశారు.
ఢిల్లీలో మోదీ ప్రభుత్వం ఉందని తెలంగాణలో కూడా బీజేపీ పాలనను తీసుకురావాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం అదిలాబాద్ లో జరిగిన బీజేపీ జనగర్జన సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ను గద్దె దించి.. బీజేపీని అధికారంలోకి తేవాలన్నారు. డిసెంబర్ 3 తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని పేర్కొన్నారు.
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ బిగ్ రియాలిటీ షో బాస్ కన్నడ హౌస్లోకి ప్రవేశించడం వివాదాలు మరియు విమర్శలను రేకెత్తించింది. షో యొక్క 10వ సీజన్ ప్రోమోలో ఈశ్వర్ అభిమానుల కోసం ఇంట్లోకి ప్రవేశించినట్లు చూపబడింది.
కేరళలోని తిరువనంతపురం జిల్లాలో ఓ పాడి రైతుకు బ్రూసెల్లోసిస్ వ్యాధి సోకింది.రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి జె.చించు రాణి దీనిపై మాట్లాడుతూ.. వెంబాయం పంచాయతీలో వ్యాధిని గుర్తించామని పాల సొసైటీలపై ప్రత్యేక దృష్టి సారించి పశుసంవర్థక శాఖ ద్వారా పాల పరీక్షలు నిర్వహించి దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు.
ఇజ్రాయెల్ సైన్యం తమభూభాగంలో దాదాపు 1,500 మంది హమాస్ మిలిటెంట్ల మృతదేహాలను కనుగొన్నట్లు తెలిపింది.ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి చెప్పిన విషయం తెలిసిందే. యుద్ధ విమానాలు హమాస్ ప్రభుత్వ కేంద్రాలకు నిలయమైన గాజా నగరంపై బాంబుల వర్షం కురిపించాయి.
:తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలకావడంతో.. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో తాయిలాలు, నగదు పంపిణీతో పాటు ఇతర ప్రలోభాలపై ఎన్నికల సంఘం నిఘా మొదలయింది.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఆయా రాష్ట్రాల్లో కుల గణన చేపట్టేందుకు చర్యలు చేపడతారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతెలిపారు. సోమవారం సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం రాహుల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కుల గణనకు అనుకూలంగా తాము చారిత్రక నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో అమెరికాకు చెందిన క్లాడియా గోల్డిన్కు నోబెల్ పురస్కారం లభించింది. మహిళల లేబర్ మార్కెట్ ఫలితాలపై విశేష కృషి చేసినందుకుగాను ఆమెకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ బహుమతికి ఎంపిక చేసింది.
టీపీసీసీ అధ్యకుడు రేవంత్రెడ్డి ట్విట్టర్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఖరారు కావడంతో ఇక కల్వకుంట్ల కుటుంబానికి కౌంట్డౌన్ మొదలైందని వ్యాఖ్యానించారు. ఈ 52 రోజుల కౌంట్ డౌన్..నాలుగు కోట్ల ప్రజలు మీ నియంత సర్కారుకు రాస్తున్న మరణశాసనం అని రేవంత్ రెడ్డి అన్నారు.