Last Updated:

Israel-Hamas war: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం: 3,000 దాటిన మృతుల సంఖ్య

ఇజ్రాయెల్ మరియు హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం ఐదవ రోజుకు చేరుకోగా ఇరు వైపులా మరణించిన వారి సంఖ్య 3,000 దాటింది. ఇజ్రాయెల్వైమానిక దాడులతో పాటు గాజాలో భూదాడిని ప్రారంభించడం ద్వారా దాడిని ఉధృతం చేయడానికి సిద్ధమవుతోంది.  భారీ సైనిక సామగ్రితో పాటు రిజర్వ్ దళాలకు చెందిన మరింత మంది సభ్యులను కూడా పిలిపించారు.

Israel-Hamas war: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం:  3,000 దాటిన  మృతుల సంఖ్య

Israel-Hamas war: ఇజ్రాయెల్ మరియు హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం ఐదవ రోజుకు చేరుకోగా ఇరు వైపులా మరణించిన వారి సంఖ్య 3,000 దాటింది. ఇజ్రాయెల్వైమానిక దాడులతో పాటు గాజాలో భూదాడిని ప్రారంభించడం ద్వారా దాడిని ఉధృతం చేయడానికి సిద్ధమవుతోంది.  భారీ సైనిక సామగ్రితో పాటు రిజర్వ్ దళాలకు చెందిన మరింత మంది సభ్యులను కూడా పిలిపించారు.

సరిహద్దు ప్రాంతాల స్వాధీనం ..(Israel-Hamas war)

హమాస్ ఉగ్రవాదుల నుండి గాజా సరిహద్దు ప్రాంతాలను తమ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ సైన్యం ఈ ప్రాంతంలోని అనేక ప్రాంతాలు మరియు రహదారులపై నియంత్రణను చేపట్టింది. యునైటెడ్ స్టేట్స్ నుండి ‘అధునాతన’ మందుగుండు సామగ్రితో మొదటి విమానం ఇజ్రాయెల్ యొక్క నెవాటిమ్ వైమానిక స్థావరంలో దిగినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ధృవీకరించింది. గోలన్ హైట్స్ ప్రాంతంలో రాకెట్లు పేల్చిన తర్వాత ఇజ్రాయెల్ సైన్యం సిరియాలో కూడా కాల్పులు  ప్రారంభించింది. యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ గురువారం ఇజ్రాయెల్‌ను సందర్శించి తన మద్దతును , సంఘీభావాన్ని తెలుపుతారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇజ్రాయెల్ మరియు పాలస్తీనియన్ల మధ్య యుద్ధం మధ్యప్రాచ్యంలో యుఎస్ విధానం యొక్క వైఫల్యాన్నిచూపిందని ఆరోపించారు.

ఇజ్రాయెల్ సైన్యం ప్రకారం, వారి యుద్ధ విమానాలు రాత్రిపూట గాజాలో 200 కంటే ఎక్కువ లక్ష్యాలను ఛేదించాయి, హమాస్ ఉగ్రవాదుల కేంద్రాలతో సహా భవనాలను కూల్చివేసాయి. కూల్చివేయబడిన ఒక ఇల్లు గాజాలోని హమాస్ సాయుధ విభాగం నాయకుడు మహ్మద్ దీఫ్ తండ్రికి చెందినదని పాలస్తీనా మీడియా నివేదించింది. యునైటెడ్ నేషన్స్ డేటా ప్రకారం, 180,000 కంటే ఎక్కువ మంది గాజా వాసులు నిరాశ్రయులయ్యారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన తాజా ప్రకటనలో హమాస్ ఉగ్రవాదులను ఐసిస్‌తో పోల్చి వారిని అంతమొందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. గాజాపై ఇజ్రాయెల్ విధించిన సంపూర్ణ దిగ్బంధనం కొనసాగుతోంది. 2.3 మిలియన్లకు పైగా జనాభా ఉన్న ప్రాంతానికి విద్యుత్, ఆహారం, ఇంధనం లేవని ఇజ్రాయెల్ పేర్కొంది.