Flipkart: ఫ్లిప్కార్ట్ కొత్త సేల్.. ఈ మూడు ఫోన్లపై ఆఫర్లే ఆఫర్స్.. ధరలు భారీగా పడిపోయాయ్..!

Flipkart: మీరు కొత్త స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, మీ కోసం ఫ్లిప్కార్ట్ మరో సేల్ను తీసుకొచ్చింది. ఇప్పుడు మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ సేల్ చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మూడు ప్రముఖ స్మార్ట్ఫోన్ల ధరలు భారీగా పడిపోయాయి, ఈ డీల్స్ మరింత మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి మీరు బడ్జెట్లో ఫీచర్-ప్యాక్డ్ స్మార్ట్ఫోన్ను కొనాలని భావిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ సేల్లో ఈ గొప్ప ఆఫర్లను చూడండి.
OPPO K12x 5G
జాబితాలో మొదటి ఫోన్ గురించి మాట్లాడితే ఇది Oppo కంపెనీ నుండి వచ్చింది. కంపెనీ ఈ ఫోన్ను రూ. 16,999కి లాంచ్ చేసింది. కానీ ఇప్పుడు మీరు కేవలం రూ. 12,999కే మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఎంపికతో ఫోన్పై రూ.1,250 తగ్గింపు అందుబాటులో ఉంది. అలానే మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరిన్ని డిస్కౌంట్లను చూస్తారు.
Motorola g45 5G
ఈ మోటరోలా ఫోన్ ఫ్లిప్కార్ట్ మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ సేల్లో కూడా చాలా చౌక ధరకు అందుబాటులో ఉంది. కంపెనీ ఈ ఫోన్ను రూ. 12,999కి లాంచ్ చేసింది. కానీ ఇప్పుడు మీరు దీన్ని కేవలం రూ. 10,999కే మీ సొంతం చేసుకోవచ్చు. IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఎంపికతో ఫోన్ రూ. 1250 వరకు, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఎంపికతో రూ. 1150 వరకు తగ్గింపు లభిస్తుంది.
Realme c61
ఫ్లిప్కార్ట్ ఈ సేల్లో ఈ రియల్మీ ఫోన్ చాలా తక్కువ ధరలో లభిస్తుంది. కంపెనీ దీన్ని రూ. 8,999కి లాంచ్ చేసింది కానీ ఇప్పుడు మీరు దీన్ని కేవలం రూ.7,699కే మీ సొంతం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, బ్యాంక్ ఆఫర్లతో ఫోన్ ధర మరింత తగ్గుతుంది. అన్ని బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్లతో రూ. 500 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది.