Home / టెక్నాలజీ
ఎలోన్ మస్క్ ట్విట్టర్లో 50 శాతం మంది సిబ్బందిని తొలగించడంనుండి బ్లూ టిక్ ఛార్జీలు వసూలు చేయడం వరకు చాలా మార్పులను ప్రవేశపెట్టాడు. ఇప్పుడు, మస్క్ ట్విటర్లో భోజనానికి ఛార్జీలు వసూలు చేస్తామని చెబుతున్నాడు.
దేశంలో అత్యంత బలమైన టెలికాం బ్రాండ్గా రిలయన్స్ జియో అవతరించింది. ముఖేష్ అంబానీకి చెందిన జియో అత్యంత వేగంగా ప్రజల ఆదరణ పొందింది. ఈ విషయాన్ని బ్రాండ్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్ కంపెనీ టీఆర్ఏ ఓ సర్వే ద్వారా వెల్లడించింది. 'ఇండియాస్ మోస్ట్ డిజైర్డ్ బ్రాండ్స్ 2022' పేరిట టీఆర్ఏ సంస్థ ఓ జాబితాను విడుదల చేసింది.
ఎలన్ మస్క్ ట్విటర్లోని అధికారిక ఖాతాలకు ఇచ్చే ‘బ్లూ టిక్’ను ప్రీమియం సర్వీసుగా తీసుకొచ్చిన సంగితి తెలిసిందే. దీనికోసం ఈ బ్లూ టిక్కు నెలవారీ ఛార్జీలు ప్రకటించారు. అయితే తాజాగా ఇలా చెయ్యండం వల్ల నకిలీ ఖాతాలు పెరిగిపోయాయని ఈ సర్వీసును నిలిపివేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ట్విటర్ బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ కన్పించట్లేదని యూజర్లు అంటున్నారు.
ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్ గురువారం ట్వట్టర్ ఉద్యోగులతో మాట్లాడుతూ సంస్ద దివాలా తీయడాన్ని తోసిపుచ్చలేనని చెప్పారు.
ఐఫోన్ 15లో యాపిల్ భారీ అప్గ్రేడ్లు చేపట్టనుందని టెక్ నిపుణులు చెప్తున్నారు. రానున్న ఐఫోన్ 15 న్యూ బయోనిక్ ఏ17 బయోనిక్ చిప్సెట్తో కస్టమర్ల ముందుకు రానుందని సమాచారం. ఐఫోన్ 15 మోడల్స్లో పెరిస్కోప్ లెన్స్ వాడేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తుంది.
జీమెయిల్ వినియోగదారులకు అలర్ట్.. ఇకపై జీమెయిల్ వినియోగదారులంతా కొత్త జీమెయిల్ డిజైన్ను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని గూగుల్ పేర్కొనింది. ఈనెల నుంచి గూగుల్ కొత్త జీమెయిల్ యూజర్ ఇంటర్ఫేస్ను అందుబాటులోకి వచ్చేస్తోంది.
ట్విట్టర్ యూజర్లపై ఎలాన్ మస్క్ మరో బాంబు పేల్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ కోసం నెలకు 8 డాలర్లు చెల్లించాలని మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ట్విట్టర్ యూజర్లందరి నుంచి డబ్బులు వసూలు చేసే ప్రణాళికలో మస్క్ ఉన్నారని ప్లాట్ఫార్మర్ తన నివేదికలో వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి నింగికెగియనుంది. దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ అయిన ‘విక్రమ్-ఎస్’ను ప్రయోగించేందుకు హైదరాబాదీ స్టార్టప్ కంపెనీ ‘స్కైరూట్ ఏరోస్పేస్’సిద్ధమైంది. ఈ రాకెట్ ద్వారా 3 కస్టమర్ పేలోడ్లను ఈనెల 12-16వ తేదీల్లో అంతరిక్షంలోకి పంపనున్నారు.
భారత దేశానికి ఆనుకునే హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న నేపాల్ దేశాన్ని ఇటీవల వరుస భూకంపాలు వణికించాయి. దీనితో ఆ భూకంపం ప్రభావం పక్కనే ఆనుకుని ఉన్న దేశసరిహద్దు భూ భాగం రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, ఢిల్లీ ప్రాంతాల్లో కూడా కనిపించింది. బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు నేపాల్లో 6.3 తీవ్రతతో భారీ భూమి కంపించింది.
పేర్లను ఎలాన్ మస్క్గా మార్చుకున్న తర్వాత ట్విట్టర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ ఆ ట్విటర్ అక్కౌంట్లను తొలగిస్తా అని అన్నారు.