Home / Vijayawada
పాలన వ్యవహారాల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిత్యం అభాసుపాలౌతుంది. తాజాగా డ్యూటీ సిబ్బంది ఏకంగా డిప్యూటీ ముఖ్యమంత్రికి ప్రవేశం లేదని ఖరాఖండిగా చెప్పడంతో అవాక్కవడం ఆయన వంతైంది. ఈ ఘటన ఇంద్ర కీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో చోటుచేసుకొనింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. కాగా నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజే భక్తులకు ఆలయంలో అసౌక్యం ఏర్పడింది. దుర్గగుడిలో కరెంట్ నిలిచిపోయింది. దాదాపు అరగంటకు పైగా కరెంట్ లేకపోవడం వల్ల భక్తులు, అర్చకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ప్రముఖ శక్తి దేవాలయంగా కీర్తింపబడుతున్న విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో రేపటినుండి దేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. శరన్నవరాత్రుల్లో పది అవతారాలలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తొలి రోజున రాష్ట్ర గవర్నర్ హరిచందన్ అమ్మవారిని దర్శించుకోనున్నారు.
సామాన్యులు, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో అవసరమైన గ్యాస్ సిలెండర్ ను రూ. 500లకే అందించే దస్త్రం పైనే కాంగ్రెస్ తొలి సంతకమని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు.
స్టూడెంట్ పై లెక్చరర్ దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటన ఇప్పుడు ఏపీలో కలకలంగా మారింది. విజయవాడ చైతన్య కాళాశాల ఘనటపై ఇంటర్మీడియట్ బోర్డ్ ఫైర్ అయ్యింది. చైతన్య కళాశాల భాస్కర్ క్యాంపస్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ టూర్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేసీఆర్ ఏపీకి ఎందుకొస్తున్నారని, అంతా ఆరా తీస్తున్నారు. మూడేళ్ల క్రితం కేసీఆర్ ఏపీ పర్యటనకు వచ్చారు. అప్పుడు సీఎం వైఎస్ జగన్ను కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఈనెల 26 నుంచి దసరా ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు. పది రోజులపాటు జరిగే ఉత్సవాలలో వివిధ అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ నెలలో విజయవాడకు వెళ్లనున్నట్లు సమాచారం. విజయవాడలో జరగనున్నసిపీఎం జాతీయ మహాసభలో ఆయన పాల్గొననున్నారు
అమరావతిపై కేంద్ర మంత్రి నారాయణ స్వామి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు అభివృద్దికి ఏపి ప్రభుత్వం సహకారం సరిగా లేదంటూనే మూడు లేదా 4 రాజధానులు పెట్టుకోవడం అనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంగా చెప్పుకొచ్చారు
విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై కొలువైన కనకదుర్గమ్మకు ఓ భక్తుడు మూడు బంగారు కిరీటాలను కానుకగా సమర్పించాడు. నవీ ముంబైకి చెందిన రెకాన్ మెరైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యజమాని జి.హరికృష్ణారెడ్డి వీటిని అమ్మవారికి సమర్పించారు.