Home / PM Modi
ఇటీవల బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతికి చెందిన నేత రిషి సునాక్ మంగళవారం తొలిసారిగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇండోనేషియా రాజధాని బాలి వేదికగా జరుగుతున్న జీ20 సదస్సుకు ఆయా సభ్య దేశాల అధినేతలు హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఒకరికొకరు ఎదురుపడి ఇద్దరు నేతలు పలకరించుకున్నారు.
జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో కరోనా కలకలం సృష్టించింది. ఇండోనేషియాలోని బాలిలో ప్రస్తుతం ఈ సమావేశం జరుగుతుంది. ఈ సదస్సుకు హాజరయిన కంబోడియా ప్రధానమంత్రి హున్ సేన్ తాజాగా కోవిడ్ బారిన పడ్డారు. దానితో, సదస్సులో సేన్ సమావేశాలన్నింటినీ రద్దు చేసుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్లో 10,742 కోట్లతో దశలవారీగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం ఇచ్చారు ప్రధాని మోదీ. దేశంలోనే విశాఖ ప్రత్యేకమైన నగరమని ఆయన తెలిపారు.
ఏపీ విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇకపోతే ఇదీ సభపై ప్రసంగించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో తమ అనుబంధం పార్టీలు రాజకీయాలకు అతీతమని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 11,12 తేదీల్లో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీలు సహా పలువురు ఉద్యమకారులు బంద్ కు పిలుపునిచ్చారు. ఇప్పటికే మోదీ గో బ్యాక్ అంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని రాకను నిరసిస్తూ విశాఖ, రామగుండం బంద్ లకు పిలుపునిచ్చారు
నేడు ప్రధాని మోదీ రెండు రోజులు ఏపీ పర్యటనలో భాగంగా నేడు సాయంత్రం విశాఖ చేరుకోనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో గవర్నర్ - సీఎం జగన్ ప్రధానికి స్వాగతం పలకేందుకు సాయంత్రం విశాఖ చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రధానితో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా భేటీ కానున్నారు.
నేడు మోదీ మోర్బీ వంతెన కూలిన ఘటన స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లనున్నారు. దానితో ‘ గో బ్యాక్ మోదీ’ అంటూ ట్విట్టర్ వేదికగా నెటిజన్లు #Go_Back_Modiహాష్ ట్యాగ్ ను తెగ ట్రెండ్ చేస్తున్నారు.
భాషతో సంబంధం లేకుండా థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్న కాంతార మూవీ భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అయితే కాంతార క్రేజ్ రాష్ట్ర ప్రభుత్వానికే కాక కేంద్రానికి సైతం పాకిందని చెప్పవచ్చు. ఈ సినిమాను ప్రధాని మోడీ స్పెషల్ స్క్రీన్ పై చిత్ర బృందంతో కలిసి చూడాలని ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం.
దేశ కరెన్సీ నోట్లపై లక్ష్మీ-గణేశుడి ఫోటోలు కూడా ఉంటే అభివృద్ధికి దోహదపడుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మంత్రికి విజ్నప్తి చేశారు.
యునైటెడ్ కింగ్డమ్లో రిషి సునక్ అత్యున్నత ప్రధాన మంత్రి పదవి చేపట్టడంపై భారత్ లో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.