Home / Pakistan
పాకిస్తాన్లో గంటల కొద్దీ విద్యుత్ కోతలతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు. విద్యుత్ కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు. దీంతో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మంగళవారం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
పాకిస్తాన్ను ప్రస్తుతం దుబాయి ప్రాపర్టీ లీక్స్ నిలువునా వణికిస్తోంది. దుబాయిలో అత్యంత ఖరీదైన విల్లాలు పాకిస్తాన్కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, మిలిటరీ, బ్యాంకర్లు, బ్యూరక్రసీకి చెందిన వారు కొనుగోలు చేస్తున్నారు.
ఇటీవల దేశ రాజధాని ఢిల్లీతో పాటు గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలోని పలు స్కూళ్లకు ఈ- మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తీరా స్కూళ్లకు సెలవు ప్రకటించి.. బాంబు కోసం గాలింపు చేపడితే ... అది కేవలం బెదరింపు ఈ మెయిల్ అని తేలింది
పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం ప్రయాణీకుల బస్సు లోయలో పడటంతో 20 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. బస్సు పంజాబ్లోని రావల్పిండి ప్రావిన్స్ నుండి హుంజాకు వెళ్తుండగా గిల్గిట్-బాల్టిస్తాన్లోని డయామర్ జిల్లాలోని కారకోరం హైవేపై డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతంలోని యూపీఏ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశానికి సంబంధించిన సమాచారం టెర్రరిస్టులకు ఇచ్చి విధ్వంసం సృష్టించేశారు. కాగా కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్కు విడదీయరాని సంబంధాలున్నాయన్నారు ప్రధాని మోదీ. ఇండియాలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలహీనపడుతోంది. అదే సమయంలో పాకిస్తాన్ మాత్రం కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి ప్రార్థనలు చేస్తోందన్నారు .
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దిన దిన గండం నూరేళ్ల ఆయుషులా తయారైంది. దీనితో దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ నడుంబిగించారు. కరాచీలోని వ్యాపారవేత్తలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో దేశానికి చెందిన అతి పెద్ద వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలంటే ముందుగా రాజకీయ సుస్థిరతకు ప్రయత్నించాలని సూచించారు వ్యాపారవేత్తలు.
తోషాఖానా కేసుకు సంబంధించి పాకిస్తాన్ కోర్టు మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్కు ఆయన భార్యకు బుష్రాబీబీకి 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఈ జంట పది సంవత్సరాల వరకు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. దీనితో పాటు వీరిద్దరు 78.7 కోట్ల రూపాయలు జరిమనా విధించింది. ఇదిలా ఉండగా మంగళవారం నాడు పాకిస్తాన్ ప్రత్యేక కోర్టు పిటిఐ వ్యవస్థాపకుడు మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్కు, ఆయన మంత్రివర్గంలో విదేశాంగమంత్రిగా పనిచేసిన షా మహ్మద్ ఖురేషిని అధికార రహస్యాల చట్టం కింది పదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ రహస్యాలను లీక్ చేసిన కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు పదేళ్ల జైలు శిక్ష పడింది.పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్, వైస్ చైర్మన్ షా మహమూద్ ఖురేషీలకు సైఫర్ కేసులో పాకిస్థాన్లోని ప్రత్యేక కోర్టు మంగళవారం పదేళ్ల జైలు శిక్ష విధించింది.
పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో గత మూడువారాల్లో 200 మందికి పైగా పిల్లలు న్యుమోనియా తో మరణించారని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. పంజాబ్ కేర్టేకర్ ప్రభుత్వం మరణించిన పిల్లలలో చాలా మంది న్యుమోనియాకు టీకాలు తీసుకోలేదని తెలిపింది. పోషకాహార లోపం, తల్లిపాలు లేని కారణంగా వీరిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని పేర్కొంది.
ఇరాన్లోని సిస్తాన్ అండ్ బలూచిస్థాన్ ప్రావిన్స్పై పాకిస్తాన్ ప్రతీకార దాడుల్లో ముగ్గురు మహిళలు మరియు నలుగురు పిల్లలతో సహా కనీసం ఏడుగురు మరణించారని ఆ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ అలీరెజా మర్హమతి స్టేట్ టీవీలో తెలిపారు. పాకిస్తాన్ దాడిలో మరణించిన వ్యక్తులు ఇరాన్ పౌరులు కాదని మర్హమతి చెప్పారు.