Home / national news
భారత దేశ నూతన పార్లమెంట్ భవనాన్ని దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అంగరంగా వైభవంగా ప్రారంభించారు. ప్రత్యేకంగా జరిపిన హోమాలు, భక్తి శ్రద్ధలతో చేసిన పూజల మధ్య ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి లోక్ సభ సభాపతి ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్, పలువురు ముఖ్యమంత్రుల, ఎంపీలు, గవర్నర్లు, తమిళనాదు ఆధీనమ్ ల మఠాధిపతులు పాల్గొన్నారు. ధర్మబద్ధ, న్యాయ పాలనకు చిహ్నమైన రాజదండం(సెంగోల్ ) ను ప్రధాని మోదీ ఈ నూతన పార్లమెంట్ లోని లోక్ సభ స్పీకర్ కుర్చీకి సమీపంలో ప్రతిష్టించారు.
కర్ణాటకలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం లో పూర్తి స్థాయి క్యాబినెట్ కొలువు తీరింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు ఎనిమిది మంది ఇప్పటికే ప్రమాణస్వీకారం చేశారు. తాజాగా శనివారం మరో 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో 34 మందితో సీఎం సిద్ధరామయ్య క్యాబినెట్ పూర్తిగా సిద్ధమైంది.
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరయ్యారు. మరికొద్ది రోజుల్లో అమెరికా పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో కొత్త పాస్ పోర్టకు దరఖాస్తు కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు.
భారత క్రికెట్ దిగ్గజం, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఈశాన్య రాష్ట్రం త్రిపుర పర్యాటక శాఖకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ప్రకటించారు.
భారత్లో తయారైన కలుషిత దగ్గు మందు తీసుకోవడం వల్ల గత ఏడాది గాంబియ, ఇండోనేషియా, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాల్లో పదుల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. . ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేసిన WHO ఈ ఘటనపై సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
బెంగళూరులో అకాల వర్షాల కారణంగా కాలువలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్ల నిండా విపరీతంగా చెత్త పేరుకు పోయింది. చెత్తను తొలగించలేక మున్సిపల్ సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు దారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎలక్ట్రిక్ బైక్ ల వినియోగాన్ని ప్రోత్సహించేలా కొనుగోలుదారులకు అందించే సబ్సిడీని భారీగా తగ్గించనుంది. దీంతో ఈవీ బైక్స్ ధరలు ఆకాశాన్ని అంటనున్నాయి.
నిరుద్యోగులకు తపాలా శాఖ శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీ తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో 12 వేల 828 గ్రామీణ డాక్ సేవక్ (GDS)ఖాళీలను భర్తీ చేయనున్నారు.
త్రివిద దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’స్కీమ్ లో భాగంగా నిర్వహించిన అగ్నివీరుల నియామక రాత పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ ఈ ఫలితాలను విడుదల చేసింది.
మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ 32 వ వర్థంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నారు. రాజీవ్ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ఢిల్లీలోని వీర్ భూమి వద్ద నివాళులు అర్పించారు.