Home / national news
చాలా మంది వారు కనపడడం లేదు.. వీరు కనపడడం లేదు.. ఏదైనా వస్తువులను దొంగలిచినట్టు.. లేదా చదువుకున్న సర్టిఫికేట్లు పోగొట్టుకున్నాం దొరికితే ఫలానా అడ్రస్కు పంపండి అంటూ పేపర్ల ద్వారానో లేదా సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుండడం చూసాం. కానీ ఒక వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా 'తన మరణ ధృవీకరణ పత్రం’ పోయిందంటూ పత్రికలో ఒక ప్రకటన ఇచ్చాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఉత్తరప్రదేశ్లో నేరాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని చెప్పవచ్చు. మొన్నామధ్య మైనర్ దళిత బాలికలైన అక్కాచెళ్లెల్లపై అత్యాచారం చేసి చెట్టుకు వేలాడదీసిన ఘటన మరువకముందే అదే తరహా ఘటన మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. యూపీలోని మొరాదాబాద్ జిల్లా ఓ మైనర్ బాలికపై కొంతమంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా ఆ బాలిక సృహలోకి వచ్చిన తర్వాత రక్తం కారుకుంటూ నగ్నంగా రోడ్డుపై నడుచుకుంటూ తన ఇంటికి చేరుకుంది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.
వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి 75 కొత్త వందేభారత్ రైళ్లను నడపాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. అందువల్ల ప్రతినెలా ఏడెనిమిది రైళ్లు సిద్ధంగా ఉండాలన్నది రైల్వే లక్ష్యం కావడంతో ఈ రైళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేశారు.
జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో కేంద్ర భద్రతా దళాల సోదాల్లో ఇద్దరు మిలిటెంట్లు దొరికారు.
గత కొద్దికాలంగా తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్రవాద సంస్థలతో సంబంధం ఉందన్న సమాచారం మేరకు పీఎఫ్ఐకి చెందిన మొత్తం వంద మందికిపైగా నిందితులను అరెస్టు చేశారు.
బాధ్యతగా మెలగాల్సిన వైద్యుడి బాధ్యతారాహిత్యం వల్ల నిండు ప్రాణం బలైంది. ఓ డాక్టర్ చేసిన నిర్లక్ష్యం వల్ల ఆ మహిళకు గర్భశోకం మిగిల్చింది. ప్రసవ వేదనతో ఆస్పత్రిలో చేరిన మహిళను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా.. పుట్టెడు శోకాన్ని మిగిల్చారు. వైద్యుడి వీడియో కాల్ సూచనల మేరకు నర్సులు ఆమెకు డెలివరీ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని చెంగల్పుట్టు సునంబేడు గవర్నమెంట్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.
నైతికత గురించి మాట్లాడేదే భగవద్గీతగా కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. భగవద్గీత మత గంధ్రం కాదంటూ ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నగేష్ పేర్కొన్నారు.
తమిళనాడులో ఇటీవలె కాలంలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో ఇంటర్ విద్యార్థిని టాయిలెట్లో శవమై కనిపించింది. ఈ ఘటనతో ప్రస్తుతం తమళనాట తీవ్ర విషాదం నెలకొంది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోవిలువైన వక్ఫ్ ఆస్తులను భూ మాఫియాలు స్వాధీనం చేసుకున్నారనే ఫిర్యాదులపై చర్య తీసుకునేందుకు సర్వే ప్రారంభించినట్లు యుపి డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్య బుధవారం చెప్పారు.
పీఎం కేర్స్ ఫండ్ కు కొత్తగా మరికొందరు ప్రముఖులను ట్రస్టీలుగా నియమించారు. ఇందులో ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా ఉన్నారు.