Home / national news
అయోధ్య సమీపంలో ఒక వ్యక్తి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు గుడి కట్టి పూజలు చేస్తున్నాడు. అయోధ్య-గోరఖ్పూర్ హైవే పై భరత్కుండ్ సమీపంలోని యోగి ఆదిత్యనాధ్ ఆలయం ఉంది. మౌర్య అనే వ్యక్తి ఈ ఆలయాన్ని నిర్మించి పూజలు చేస్తున్నారు.
రాజకీయ నాయుకులు మాత్రం మనుషులు కారా ఆటలు ఆడరా... మాకు అంతో ఇంతో క్రీడల్లో ప్రావీణ్యం ఉంటుంది బాస్ అంటారు కొందరు పొలిటీషియన్స్. ఈ ధోరణికి చెందిన వారే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా... ఈ ఎంపీ చీర కట్టులో ఫుట్బాల్ మైదానంలో దిగి వీరలెవెల్లో ఆట ఆడారు. ఆమె ఆటను చూసిన వారు చప్పట్ల మోత మోతమోగించారనుకోండి.
ఢిల్లీలో డెంగ్యూ కేసులు భారీగా నమోదయ్యాయి, గత వారంలో 100 మందికి పైగా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు నగరంలో వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధి యొక్క సంఖ్య దాదాపు 400కి చేరుకుంది.
భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా మరో ఘనత సాధించాడు. వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్లో 4 పతకాలు గెలిచిన తొలి రెజ్లెర్ గా బజరంగ్ చరిత్రకెక్కాడు.
చండీగఢ్ యూనివర్సిటీ హాస్టల్లో 60మంది అమ్మాయిల వీడియో లీక్ అనే వార్త విధితమే. ఈ సంఘటనతో ఆందోళనలతో యూనివర్సిటీలో అట్టుడికింది. కాగా ఈ ఘటనలో తాజాగా పంజాబ్ ప్రభుత్వం మరియు వర్సిటీ అధికారులు హాస్టల్ వార్డెన్ రజ్విందర్ కౌర్ను సస్పెండ్ చేశారు.
వినాయకుడి విగ్రహం పాలు తాగడం... చెట్టు నుంచి పాలు కారడం... వంటి వాటిని మనం వినే ఉంటాం. కాగా వీటిని కొందరు హిందువులు దైవం చేస్తున్న అద్భుతంగా భావిస్తారు. అయితే ప్రస్తుతం ఇలాంటి ఘటనే మరొకటి తాజాగా మధ్యప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది.
కొందరు వ్యాపారులు చేస్తున్న పనులు చూస్తుంటే పట్టలేనంత కోపం వస్తుంది. అలాంటి వారిని అస్సలు సహించకూదని వారికి తగినబుద్ధి చెప్పాలనిపిస్తుంది. అయితే పానీపూరీ విక్రయించే చిరు వ్యాపారులు కొందరు అందులో మురుగు నీరు కలపడం, హోటళ్లలోని ఆహారపదార్దాల తయారీలో ఉమ్మి, చెమట వేయడం, వంట చేసే దగ్గర శుభ్రత పాటించకపోవడం వంటి ఘటనలు అప్పుడప్పుడూ ఎక్కడో ఓ చోట చూస్తూనే ఉంటాం. కాగా ప్రస్తుతం అలాంటి ఘటన ఒకటి సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బాధ్యత గల వృత్తిలో ఉండి మానవత్వంతో సేవ చేయాల్సిందిపోయి... కర్కశంగా ప్రవర్తించాడు. ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించాల్సిన వైద్యుడు ఓ మూగజీవి ప్రాణం తీసేందుకు యత్నించాడు. కుక్కను కారుకు కట్టేసి ఊరంతా పరిగెత్తించాడు. కారు వెంట పరుగెత్తలేక ఆ మూగజీవి చిత్రహింస అనుభవించింది. ఈ హృదయ విదారక ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది.
పాఠశాల లిఫ్ట్ లోపల కాలు, బయట శరీరం ఇరుక్కుని ఒక ఉపాధ్యాయురాలు మరణించింది. ఈ దుర్ఘటన మహారాష్ట్ర రాజధాని అయిన ముంబైలో జరిగింది.
ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అద్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నుండి వచ్చిన ఆఫర్ ను తిరస్కరించిన్నట్లు చెప్పడమే అందుకు కారణమన్నారు. గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీకి ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారని తెలుసన్నారు.