Home / Mahesh Babu
త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి చిత్రం #SSMB28 ఆలస్యమైంది
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఇటీవల తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందడంతో తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయాడు. కాగా మహేష్ ఇంట్లో ఒంటరిగా ఉండడం కంటే సెట్స్ ఉండడం మేలని త్రివిక్రమ్ మరియు ఆయన కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే త్వరలో మహేష్ సెట్స్ పైకి రానున్నట్టు ప్రచారం జరుగుతుంది.
సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. తండ్రి అస్థికలను నిమజ్జనం చేయడం కోసం ప్రిన్స్ మహేష్ బాబు సహా కుటుంబ సభ్యులు విజయవాడ వెళ్లారు.
సూపర్స్టార్ కృష్ణకు ఘననివాళులర్పించేందుకు ఆయన కుటుంబసభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన గుర్తుగా ఓ మెమెరియల్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు మహేష్ బాబు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారట.
సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15న కన్నుమూశారు. అయితే ఆయన మరణానంతరం అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన తన ఆస్తిపాస్తులు తన తదనంతరం ఎవరికి చెందాలనేది ఓ వీలునామా రాశారట. ప్రస్తుతం ఆ వీలునామా టాలీవుడ్ నాట విపరీతంగా ప్రచారం జరుగుతోంది.
సూపర్ స్టార్ కృష్ణ మరణవార్త విని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చిత్రసీమలో సూపర్స్టార్ బిరుదుకు సార్థకత చేకూర్చారన్నారని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు. కృష్ణ పార్ధివ దేహానికి నివాళులర్పించారు పవన్ కళ్యాణ్. మహేష్ బాబు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పవన్ చూసిన మహేష్ కాస్త ధైర్యం లభించినట్టు అయ్యింది.
నాలుగు దశాబ్ధాల పాటు వెండితెరపై మెరిసి, తెలుగు చిత్ర పరిశ్రమ నాట చెరగని ముద్ర వేశారు సూపర్ స్టార్ కృష్ణ. ముక్కుసూటిగా, నిజాయితీగా మాట్లాడేవాడు. తన సినిమా ఫ్లాప్ అయితే నిర్మొహమాటంగా ఆ సంగతి అంగీకరించేవాడు అలాంటి వ్యక్తిత్వం ఉన్న కృష్ణను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ప్రేక్షకులను అలరించేందుకు ఆయన నిర్విరామంగా సినిమాలు చేస్తూ మంచి స్టార్ డమ్ తెచ్చుకున్నారు.
తెలుగు ఇండస్ట్రీ నాట విషాధ ఛాయలు నెలకొన్నాయి. కళామ్మతల్లి ఒక్కసారిగా మూగబోయింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ మరో పెద్ద దిక్కును కోల్పోయింది. వెండితెరపై నాలుగు దశాబ్ధాల పాటు సూపర్ స్టార్ గా వెలుగొంది.. తెలుగు సినీ ఖ్యాతిని ఖండాతరాలకు చాటి చెప్పిన హీరో కృష్ణ ఇకలేరు.
నమ్రత శిరోద్కర్ లండన్ నుండి కొన్ని కుటుంబ చిత్రాలను ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. తదుపరి ప్రాజెక్ట్ కోసం మహేష్ ప్రస్తుత రూపాన్ని ఫోటోస్ లో చూసి అభిమానులు కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.
మహేష్ ఆ పేరులోనే ఓ మత్తు ఉంటుంది అని ఓ సినిమాలో కలర్స్ స్వాతి చెప్పిన డైలాగ్. మహేష్ కున్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే అది నిజమేననిపిస్తుంది కొన్ని సార్లు. ఈ నేపథ్యంలోనే సౌత్ ఇండియాలో ఏ స్టార్ హీరోకు దక్కని ఓ అరుదైన గౌరవం మహేష్ కు దక్కింది. సోషల్ మీడియా దిగ్గజం అయిన ట్విట్టర్ లో ఆయన ఫాలోవర్స్ సంఖ్య దాదాపు 13 మిలియన్లు దాటింది.