Home / Maharashtra
ఏ వేడుకలైనా ఎవరికీ హానీ కలుగనంతవరుకే ఆనందంగా ఉంటాయి. కానీ సృతిమించితే అనేక అనర్ధాలకు దారి తీస్తాయి. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో ఒకటి చోటుచేసుకుంది. గణనాథుని వేడుకలలో దాదాపు 65 మంది చూపు పోగొట్టుకున్నారు.
1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ సమాధిని సుందరీకరించడం పై విచారణకు ఆదేశించామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తెలిపారు.
మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇటీవల ఆగస్టు 26 నుంచి 75 ఏళ్లు పైబడిన వారు తమ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. ఉచిత ప్రయాణానికి వారు తమ టిక్కెట్లను ఆగస్టు 26లోపు బుక్ చేసుకున్నట్లయితే ఛార్జీల వాపసు పొందుతారు, 65 మరియు 75 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఎంపికచేసిన బస్సుల్లో టిక్కెట్ ఛార్జీలపై 50 శాతం రాయితీని పొందుతారు
మహారాష్ట్రలో ఉగ్రవాదులు మరో భారీ కుట్రకు తెరలేపినట్టుగా కనిపిస్తోంది. ముంబై నుంచి రాయ్ఘడ్ వెళ్లే మార్గంలో ఉన్న హరిహరేశ్వర్ బీచ్లో అనుమానాస్పద బోట్లను పోలీసులు గుర్తించారు. రెండు బోట్లలో భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రి లభ్యమైంది.
జైలులో ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) నాయకుడు నవాబ్ మాలిక్పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ డైరక్టర్ సమీర్ వాంఖడే ఆదివారం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖకు చెందిన ముంబై జిల్లా కుల ధృవీకరణ కమిటీ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత ఆయన ఈ చర్య తీసుకున్నారు.
మంగళవారం ఉదయం ముంబయిలోని రాజ్భవన్లో జరిగిన మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ మొదటి దశలో 18 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ మంత్రులతో ప్రమాణం చేయించారు. బీజేపీ నుంచి మంత్రి మండలిలో చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గిరీష్ మహాజన్,
శివసేన ఎంపీ సంజయ్ రౌత్పై ఈడీ సీరియస్ అయ్యింది. శివసేనకు చెందిన సామ్నా అనే పత్రికలో వారం వారం రోక్ తక్ అనే కాలాన్ని సంజయ్ రౌత్ రాస్తుంటారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నందున జైలు నుంచి వారం వారం కాలం రాసే అవకాశం లేదు. అయితే ఆదివారం సామ్నా పత్రికలో కూడా రౌత్ కాలం ప్రచురితమైంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కేబినెట్ విస్తరణ రంగం సిద్దం చేశారు. ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ర్ట అసెంబ్లీ సమావేశం కానున్న నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం జరుగనుంది. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు హోంశాఖ లభించే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
ప్రస్తుతం ఈడీ అదుపులో ఉన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ముంబై కోర్టులో ఈడీపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు గుప్పించారు. తనను వెంటిలేటర్, కిటికిలేని గదిలో ఉంచి ఇబ్బందులకు గురి చేశారని ఫిర్యాదు చేశారు. కాగా రౌత్ ఆరోపణలను ఈడీ ఖండించింది. సంజయ్ రౌత్ను
మహారాష్ట్రలో ఈ నెలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు 800,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 2022 జూలై 11 మరియు 12 తేదీల్లో కురిసిన భారీ వర్షాల వల్ల 24 జిల్లాల్లోని రైతులు ఎక్కువగా మరాఠ్వాడ మరియు విదర్భ ప్రాంతాలలో నష్టపోయారు. వరి, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, మరియు అరటి పంటలు