Home / latest Telangana news
కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వివిధ హోదాల్లో సెక్రెటరీలుగా పనిచేసిన దాదాపు 10 మంది ఐఏఎస్ లు ఈరోజు విచారణకు హాజరయ్యారు . కాగా వీరి హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాలు, అందుకు గల కారణాలను కమిషన్ అడిగి తెలుసుకుంది.
తెలంగాణలో రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షలు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్వల్పకాలిక పంట రుణాలను మాఫీ చేయనున్నారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య తీసుకున్న రుణాలు మాఫీ కానున్నాయి. రుణమాఫీ అమలుకు రేషన్ కార్డు తప్పనిసరి చేశారు.
బోనాల పండుగ చెక్కుల పంపిణీ సందర్భంగా అధికారులు ప్రోటోకాల్ ను ఉల్లంఘించారంటూ మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. మహేశ్వరంలోని ఆర్కేపురం డిజవిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలకు ఆలయ కమిటీలకు చెక్కుల పంపిణీ సందర్బంగా సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
అక్రమ అబార్షన్లు చేస్తూ భ్రూణ హత్యలకు పాల్పడుతున్న హుజురాబాద్ పట్టణంలోని శ్రీ మాధవి నర్సింగ్ హోంను సీజ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాత్రి జిల్లా వైద్య శాఖ అధికారులు సీజ్ చేశారు.
గులాబీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. టీ కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్శ్ దెబ్బకి గులాబీ పార్టీ చతికిలపడిపోతోంది. ఒక్కో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు దిగి హస్తం గూటికి చేరుతుండడంతో గులాబీ పార్టీ ఖాళీ అవుతోంది
తెలంగాణలో బ్రాహ్మణ సంక్షేమ కార్యక్రమాలను వెంటనే పునరుద్ధరించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి హరీష్ రావు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డిని కోరారు. నాటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలోని గత పరిపాలనలో ఏర్పాటైన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ప్రస్తుత పరిస్థితిపై హరీశ్రావు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లోని గోపన్పల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇది బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టు అని, వెంటనే ప్రారంభించాలని ఆయన సామాజిక మాధ్యమం x లో డిమాండ్ చేశారు.
డీఎస్సీ పరీక్షలకు తెలంగాణ విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. డీఎస్సీ పరీక్షల హాల్ టిక్కెట్లు ఇప్పుడు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు విద్యా శాఖ ప్రకటించిన అధికారిక వెబ్సైట్ నుండి తమ హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనకు దిగిన డీఎస్సీ అభ్యర్థులపై దురుసుగా ప్రవర్తించారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయబోతున్న బీఆర్ఎస్వీ నేతలపై లాఠీచార్జ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ రవిగుప్తాను హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.