Home / latest national news
శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి)కి చెందిన శాసనసభ్యులందరూ ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటుకు ఏక్నాథ్ షిండే నాయకత్వం వహించినప్పుడు బీజేపీతో చేతులు కలపాలని కోరుకున్నారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. బీజేపీతో జతకట్టాలనే ఉద్దేశ్యాన్ని ధృవీకరిస్తూ ఎమ్మెల్యేలు ఒక లేఖపై సంతకం చేశారని చెప్పారు.
మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేసారు. దీనిపై రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా దీనిపైమాట్లాడుతూ, వ్యక్తి యొక్క చర్య హేయమైనది, ఖండించదగినది మరియు మానవత్వానికి అవమానం అని పేర్కొన్నారు
రుతుపవనాల ప్రభావంతో కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ మరియు కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోని 12 జిల్లాల్లో, మహారాష్ట్రలోని ముంబైలో కూడా నేటికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. ఢిల్లీలో రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది, వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది,
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలను విమర్శించేందుకు ఎస్సీవో కమిటీ ఎన్నడూ వెనుకాడకూడదని స్పష్టం చేశారు.
గ్రేటర్ నోయిడా పోలీసులు సోమవారం ఒక పాకిస్తానీ మహిళ మరియు ఆమె నలుగురు పిల్లలను అక్రమంగా ఆశ్రయం పొందిన వ్యక్తిని అరెస్టు చేశారు. వీరిద్దరు ఆన్లైన్ గేమ్ పబ్జీ ద్వారా కలుసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
భారతీయ జనతాపార్టీ (బీజేపీ) అధిష్టానం నాలుగు రాష్ట్రాల అధ్యక్షులను మార్చింది. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కిషన్రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమించారు
ఉద్యోగాల కోసం భూములు కుంభకోణంలో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ యాదవ్, రబ్రీ దేవిలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సోమవారం చార్జిషీట్ దాఖలు చేసింది.ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
ఎన్సీపీకి చెందిన జయంత్ పాటిల్ అజిత్ పవార్ మరియు ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ను తమ పార్టీ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్కు ఇచ్చినట్లు చెప్పారు. ఎన్సీపీ శ్రేణులు పార్టీ అధినేత శరద్ పవార్కు అనుకూలంగా ఉన్నాయని ఎన్నికల కమిషన్కు ఇ-మెయిల్ కూడా పంపినట్లు పాటిల్ తెలిపారు.
ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని రైల్వే సేఫ్టీ కమిషనర్ ( సీఆర్ఎస్ ) నివేదిక తేల్చి చెప్పిందని తెలుస్తోంది. దీనితో ఈ ప్రమాదం వెనుకు ఎటువంటి కుట్ర లేదని స్పష్టమయింది.
ప్రధాని నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ కలకలం రేపింది. నో ప్లయింగ్ జోన్లో డ్రోన్ చక్కర్లు కొట్టినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. దీనిపై ఢిల్లీ పోలీసులకు ఎస్పీజీ సమాచారం ఇచ్చింది. డ్రోన్ ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.