Home / latest national news
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ పలువురు ఎమ్మెల్యేల మద్దతుతో ఆదివారం మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరారు. ఆయన ఈ పదవిని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్తో పంచుకోనున్నారు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరపున దుబాయ్ లో తాను మూడు ఫ్లాట్స్ ను కొనుగోలు చేసినట్లు మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ తెలిపాడు. కేజ్రీవాల్ కు రాసిన ఒక లేఖలో అతను ఈ విషయాన్ని ప్రస్తావించాడు.
West Bengal: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎంపీ సీట్ల కోసం పెద్ద రచ్చే నడుస్తోంది. ఎవరి సీట్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అన్న సందేహంతో పలువురి పేర్లను పరిశీలిస్తోంది కేంద్రం. ఇకపోతే ఓ రాజ్యసభ సీటు కోసం బీజేపీ ఇద్దరు ప్రముఖుల పేర్లను పరిశీలిస్తోంది.
ఇకనుంచి బీహార్ లో జరిగే ప్రతీ వివాహం పోలీసులకు ముందే తెలుస్తుంది. ప్రజలు తమ కుటుంబంలో జరిగే వివాహాలకు సంబంధించి సమాచారాన్ని స్దానిక పోలీసులకు తెలియజేయాలని లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ సంజయ్ సింగ్ తెలిపారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం తెలిపారు. అన్ని పార్టీల నుండి ఉత్పాదక చర్చలు జరగాలని ఆయన ట్విట్టర్లో కోరారు.
2002 గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించిన కేసుల్లో సాక్ష్యాధారాలు మరియు సాక్షులకు ట్యూటర్ని అందించిన ఆరోపణలకు సంబంధించి వెంటనే లొంగిపోవాలని సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్ను గుజరాత్ హైకోర్టు శనివారం ఆదేశించింది.
మహిళలు సెక్స్ కు తమ అంగీకారాన్ని తెలిపే వయస్సును 18 నుండి 16 సంవత్సరాలకు తగ్గించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడంటూ 20 ఏళ్ల యువకుడిపై దాఖలయిన ఎఫ్ఐాఆర్ ను కొట్టివేస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ప్రతీఏటా జరిగే అమర్నాథ్ వార్షిక యాత్ర శనివారం (జూలై 1) ప్రారంభమైంది. 62 రోజుల యాత్రను బల్తాల్ బేస్ క్యాంప్లో శ్రీ అమర్నాథ్ జీ పుణ్యక్షేత్రం బోర్డు సీనియర్ అధికారులతో పాటు డిప్యూటీ కమిషనర్ గందర్బల్ శ్యాంబీర్ జెండా ఊపి ప్రారంభించారు.
మణిపూర్ లో కొనసాగుతున్న హింసాకాండ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ రాజీనామా లేఖను శుక్రవారం పలువురు మహిళలు చించివేశారు.బీరెన్ సింగ్ రాజీనామా పత్రంలో పాటు 20 మంది ఎంఎల్ఏలను తీసుకుని గవర్నర్ నివాసానికి బయలు దేరారు
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు 100 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేశాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏప్రిల్ 2022 మరియు జూన్ 2023 మధ్య కాలంలో, మొత్తం 2,140 ట్రిప్పుల్లో 25.20 లక్షల మంది ప్రయాణికులు ఈ సెమీ-హై స్పీడ్ రైళ్లలో ప్రయాణించినట్లు జూన్ 21 వరకు ఉన్న డేటా చూపుతోంది.