Home / latest national news
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఝజ్జర్ కోట్లి సమీపంలో మంగళవారం బస్సు లోయలో పడి పది మంది మృతి చెందగా, 55 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో 75 మంది ప్రయాణికులతో బస్సు అమృత్సర్ నుంచి కత్రాకు వెడుతోంది.
ఈ ఏడాది జూలైలో చంద్రయాన్-3ని ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్ సోమవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి రెండవ తరం నావిగేషన్ ఉపగ్రహం NSV-01 విజయవంతంగా ప్రయోగించబడిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేసారు.
దేశరాజధాని ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో 16 ఏళ్ల బాలికను ఒక యువకుడు 40 సార్లు కత్తితో పొడిచి బండరాయితో తలపై మోది చంపాడు. రద్దీగా ఉండే వీధిలో ఈ ఘటన జరిగినప్పటికీ ఎవరూ అడ్డుకోవడానికి ముందుకు రాలేదు. ఈ దారుణ హత్య సీసీటీవీలో రికార్డయింది. మృతురాలిని షహబాద్ డెయిరీ ప్రాంతంలోని జేజే కాలనీకి చెందిన సాక్షిగా గుర్తించారు.
మధ్యప్రదేశ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 150 సీట్లు గెలుచుకుంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ధీమా వ్యక్తం చేశారు.ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో పార్టీ ఎన్నికల సన్నద్ధత సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటకలో విజయం సాధించిన తర్వాత మధ్యప్రదేశ్లో పార్టీ విజయ పరంపరను కొనసాగిస్తుందని అన్నారు.
కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ను వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కలిశారు. ఈ ఉదయం బెంగుళూరులో ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారని.. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఆమె అన్నారు. అనంతరం మహానేత వైఎస్సార్తో ఉన్న సాన్నిహిత్యాన్ని శివకుమార్ గుర్తు చేశారు.
ఇస్రో చేపట్టిన జీఎస్ఎల్వీ – ఎఫ్ 12 రాకెట్ ప్రయోగం విజయవంతంగా పూర్తి అయ్యింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం వేదికగా జరిగిన ఈ ప్రయోగంలో జీఎస్ఎల్వీ – ఎఫ్ 12 రాకెట్ నింగి లోకి దూసుకెళ్లి.. 2వేల 232 కిలోల బరువుతో NVS -01 ఉపగ్రహాన్ని మోసుకెళ్లి నిర్ణీత వ్యవధిలో కక్ష్యలో ప్రవేశపెట్టింది. దాదాపు 19 నిమిషాల ప్రయాణం తర్వాత.. ఎన్వీఎస్-O1 ఉపగ్రహం ఖచ్చితంగా
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా వాయిదా వేయబడిన దశాబ్దాల జనాభా గణన 2024 ఏప్రిల్-మేలో జరగబోయే తదుపరి లోక్సభ ఎన్నికలకు ముందు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, కార్లు, ద్విచక్ర వాహనాలు మరియు వినియోగించే ప్రధాన తృణధాన్యాల తో సహా కనీసం 31 ప్రశ్నలు సెన్సస్లో అడగబడతాయి.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం కొత్త సాధారణ పాస్పోర్ట్ను అందుకున్నారు,గాంధీకి ఆదివారం పాస్పోర్టు మంజూరు చేస్తామని పాస్పోర్ట్ కార్యాలయం హామీ ఇచ్చిందని, మధ్యాహ్నం దానిని పొందారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాహుల్ అమెరికాలో మూడు నగరాల పర్యటనకు శ్రీకారం చుట్టారు.
కర్ణాటక కాంగ్రెస్ నేత టీబీ జయచంద్ర మనవరాలు తన తాతను మంత్రిని చేయాలని రాహుల్ గాంధీకి లేఖ రాసింది. ఇటీవల జరిగిన కర్నాటక మంత్రివర్గ విస్తరణలో తన తాతయ్యకు చోటు దక్కకపోవడంతో జయచంద్ర మనవరాలు ఆర్ణా సందీప్ రాహుల్ గాంధీకు లేఖ రాసింది.
మణిపూర్ లో పౌరులపై అత్యాధునిక ఆయుధాలు ప్రయోగిస్తున్న ఉగ్రవాద గ్రూపులపై ప్రతీకార, రక్షణ చర్యలలో కనీసం 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఆదివారం తెలిపారు.ఈ ఉగ్రవాదులు వివిధ ప్రాంతాల్లో హతమయ్యారు. కొందరిని భద్రతా బలగాలు అరెస్టు చేశాయని ముఖ్యమంత్రి తెలిపారు.