Home / Kishan Reddy
అవినీతి కుటుంబ పాలనకు నవంబర్ 3న మునుగోడు ప్రజలు మీటర్లు తో లెక్క తేల్చనున్నారని పెట్టనున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఉప ఎన్నిక నేపధ్యంలో భాజపా అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో చేపట్టిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ దసరా రోజున జాతీయ పార్టీ ప్రకటన చేస్తున్న క్రమంలో ఆ పార్టీ తీరును కేంద్ర పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు
తెలంగాణకు వచ్చి తిడుతున్నారు. ఢిల్లీలో అవార్డులిస్తున్నారు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు కేంద్రం పై ఆరోపణలు చేస్తున్నారు. అందుకు సాక్ష్యంగా మిషన్ భగీరథకు వచ్చిన అవార్డును చూపిస్తున్నారు. అయితే అవార్డు ఇచ్చింది మిషన్ భగీరధకు కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. కాగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంటికి ఆయన వెళ్లారు. ఇటీవలే ఈటల తండ్రి మల్లయ్య మృతి చెందారు. కాగా వారి ఇంటికి వెళ్లి మల్లయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను అమిత్ షా పరామర్శించారు.
తెలంగాణ విమోచన దినోత్సవం, తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాలు ఈ రెండింటి పేర్లతో భాజపా, టిఆర్ఎస్ పార్టీలు తెలంగాణా రాజకీయాలను హీటెక్కిస్తున్నాయ్. ప్రజలు ఓట్లు మాకంటే మాకంటూ ఇరు పార్టీలు విమోచన దినోత్సవం, వజ్రోత్సవాలను తమ స్వార్ధానికి వినియోగించుకొంటున్నారు.
చవటలు, సన్నాసులు, దద్దమ్మలు అంతకుమించి మరీ అసభ్య పదజాలాలు ఇది నేటి తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ్యులు, మంత్రులు ఉచ్ఛరిస్తున్న మాటలు. శాసనసభ హుందాతనాన్ని మరిచి మరీ రాజకీయ అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశానికి తెలంగాణ దిక్సూచి అంటూనే పొరుగు రాష్ట్రంపై అక్కసు వెళ్లగక్కిన ఘటన తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకొనింది.
చారిత్రక నగరం వరంగల్ కు అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్లో వరంగల్ చేరిందంటూ కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోమవారం రాత్రి ట్వీట్ చేశారు.