Home / Janasena
ప్రధానికి ఫిర్యాదు చేయడానికి నీవేమైనా పుడింగివా అని జనసేన పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు.
ప్రధాని నరేంద్రమోదీతో జనసేనాని పవన్ కల్యాణ్ ఏకాంత భేటీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. విశాఖ సాగరతీరాన జరిగిన ఈ సమావేశం, ఏపీలో అనేక రాజకీయ మార్పులకు దారి తీసే అవకాశం ఉందా? పవన్ను పిలిపించుకొని మరీ ప్రధాని మాట్లాడటం దేనికి సంకేతం? ఈ భేటీతో పవన్ ఇమేజిని మోదీ అమాంతం పెంచేశారా?
విశాఖ ఋషికొండ బీచ్ కు చేరుకొని నడక సాగిస్తూ ఋషికొండ లో తవ్విన కొండను పరిశీలిస్తున్న పవన్ కళ్యాణ్ ఫోటోలు.రిషికొండ ను మింగేస్తున్న వైసీపీ ప్రభుత్వ తీరును కనులారా వీక్షించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు. విశాఖపట్నం పర్యటన లో భాగంగా శనివారం సాయంత్రం రుషికొండ ను పరిశీలించడానికి వెళ్లగా, కొండ చుట్టూ బారికేడ్లు పెట్టి లోపల పనులు చేస్తుండటంతో బయట నుంచి కొండపై జరుగుతున్న పనులను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం. కాగా అందరిలో మోడీ , పవన్ తో ఏం మాట్లాడారు? లోకల్ బీజేపీతో ఉన్న సమస్యలను గతంలో పవన్ లేవనెత్తారు. మరిప్పుడు ఇవే సమస్యలు ఇప్పుడు మోదీ ముందు ఉంచారా?
ఏపీలో రోజురోజుకు జనసేనాని బలం పెరుగుతోందా అంటే అవుననే అంటున్నాయి కొన్ని సర్వేలు. ఇటీవల ఎవరి ఎదుగుదల ఎంత అనేదానిపై వైసీపీ, తెదేపా పార్టీలు సర్వేలు నిర్వహించగా వీటిలో ఏపీలో జనసేన దూసుకుపోతోందని తెలుస్తోంది.
ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటన సందర్బంగా ఆయనతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అవుతారనే వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
యోగి వేమన యూనివర్శిటీలో అధికారులు యోగి వేమన విగ్రహాన్ని తొలగించి ఆ స్దానంలో వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. అధికారుల అత్యత్సాహం పై పలువురు మండిపడుతున్నారు. దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ సర్కార్ పరోక్షంగా కక్ష సాధింపులకు దిగుతోంది. ఇటీవల రోడ్డు విస్తరణ కోసం ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత వివాదాస్పదంగా మారడం. బాధితులకు పవన్ అండగా నిలిచి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.
జనసేన మరోసారి జగన్ సర్కార్పై డిజిటల్ సమరం ప్రారంభించింది. ఈ నెల 12,13,14 తేదీల్లో జగనన్న కాలనీ ఇళ్లు, టిడ్కో ఇళ్ల పై జనసేన సోషల్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్లో ఓ వీడియో పోస్టు చేశారు. ఫ్యూడలిస్టిక్ కోటల్ని బద్దలు కొట్టక తప్పదు అంటూ సాగిన ఈ వీడియోలో పవన్ ఇలా అన్నారు.