Home / AP Politics
స్కిల్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు తప్పు చేశారని ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేస్తున్నానని నారా లోకేష్ అన్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండులో ఉన్న చంద్రబాబుతో భువనేశ్వరి, లోకేశ్ శనివారం ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు బయట మీడియాతో లోకేశ్ మాట్లాడారు.
ఓ ప్రైవేటు కార్యక్రమానికి మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి అంబటిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు అక్కడికి కర్రలతో వెళ్లారు. అక్కడ అంబటి రాంబాబుతో టీడీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో టీడీపీ నేత కేతినేని హరీష్తో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని మూడు చోట్ల ఈరోజు వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "సామాజిక సాధికారిత బస్సు యాత్ర"లు ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్ర లోని ఇచ్ఛాపురం.. కోస్తాలోని తెనాలి.. రాయలసీమలోని శింగనమల నుంచి ఈ బస్సు యాత్రలు ప్రారంభమయ్యాయి. ఈ యాత్రలో భాగంగా 53 నెలల వైఎస్ జగన్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి,
రాష్ట్రంలోని మద్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె జగన్ సర్కారు పై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏపీ సర్కారు మద్యం సేకరిస్తున్న కంపెనీల పేర్లు బహిర్గతం చేయాలన్నారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని.. టీడీపీ లీడర్ నారా లోకేష్ పై నిప్పులు చెరిగారు. లోకేష్ సమర్ధుడైతే ఇంట్లోని మహిళలు రోడ్లపైకి ఎందుకు వస్తారని కామెంట్ చేశారు. ఈ మేరకు గుడివాడలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన లోకేష్ ఢీల్లీ పారిపోయి.. తన తల్లిని రోడ్లపై తిప్పుతున్నారని తీవ్రంగా విమర్శించారు.
తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.. ‘నిజం గెలవాలి’ యాత్రను ప్రారంభించారు. ఈ మేరకు ముందుగా నారావారిపల్లెలో ఆమె తండ్రి, తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి యాత్రను ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు అరెస్ట్తో ఆవేదన చెంది మరణించిన తెదేపా కార్యకర్తలు, అభిమానుల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శిస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం సాయంత్రమే తిరుమలకు చేరుకున్న ఆమె ఈరోజు వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు భువనేశ్వరికి స్వాగతం పలకగా.. దర్శనం అనంతరం వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నేడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించిన ఆయన.. సమావేశంలో మాట్లాడుతూ .. రాష్ట్రానికి బలమైన దిశా నిర్దేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టే తెలుగుదేశంతో కలిశాం అని ఆయన అన్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఏ మాత్రం నిర్లక్ష్యంతో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పిటిషన్ పై పలుమార్లు వాదనలు వినిపించారు. పలుమార్లు వాయిదా కూడా పడింది. తాజాగా ఈరోజు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెదేపా చీఫ్ చంద్రబాబుకు మళ్ళీ చుక్కెదురైంది. కాగా ఏసీబీ కోర్టులో.. చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేయడంతో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే పలుమార్లు ఈ విచారణ వాయిదా పడగా.. తాజాగా ఈ పిటిషన్ పై మంగళవారం ఉదయం హైకోర్టు విచారణ చేపట్టింది.