Home / Ap Government
నీరు, రోడ్లు, విద్యుత్ వంటి కనీస వసతులను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదిగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో కిసాన్ క్రాఫ్ట్ ను సందర్శించిన సందర్భంలో ఆయన ఈ మేరకు రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై ప్రభుత్వానికి చురకలు అంటించారు
దశాబ్ధాల పాటు ఆయన కీర్తి అజరామం. తన గానంతో సప్త స్వరాలు పలికించారు. వేలాది పాటలు పాడిన ఘనత ఆయనది. దేశ విదేశాల్లో కోట్లాది సంగీత ప్రియుల మనసును దోచి అమరుడైన ఆ గాన గంధర్వుడికి గుంటూరులో ఘోర అవమానం చోటుచేసుకొనింది.
నెలపుట్టి మూడు రోజులు అవుతున్నా జీతం కోసం 50 నుండి 60శాతం మంది ఏపి ఉద్యోగులు, ఫింక్ఛన్ దారులు ఎదురు చూపులు చూస్తున్నారు. పండుగ పూట కూడ జేబులు వెతుక్కొనే పరిస్ధితులు చాలా మందికి ఏర్పడింది.
ఏపీ ప్రభుత్వం నేడు సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. రిజర్వ్ బ్యాంకు బాండ్ల వేలంలో ఈ మేరకు రాష్ట్రానికి అప్పు ముట్టింది
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి పట్ల జిల్లా కలెక్టర్ దుర్గారావు అమర్యాదగా ప్రవర్తించారు. హైకోర్టు జడ్జి మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రికి వస్తున్నారని ఈవో భ్రమరాంభకు ముందస్తుగా సమాచారం అందించారు. అయితే ఘాట్ రోడ్డులో జడ్జి వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు.
ఏపీలో ‘ నేటినుంచి వైఎస్ఆర్ కళ్యాణమస్తు’, ‘షాదీ తోఫా’ పథకాలు అమల్లోకి రానున్నాయి. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ తోఫా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. బాల్యవివాహాలను నివారించడం డ్రాపౌట్ రేట్ను గణనీయంగా తగ్గించడం లక్ష్యాలుగా వైఎస్సార్ షాదీ తోఫా పథకాలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఓ వైపు ఆర్ధిక భారం. మరో వైపు ఉన్న పధకాల్లో లొసుగులు. నెల పుడితే కొత్త అప్పులకు ఎదురుచూపులు. అయినా ఏపీ ప్రభేత్వం తగ్గేదేలేదంటూ మరో రెండు సంక్షేమ పధకాలకు శ్రీకారం చుట్టింది
ఒకే రాజధాని, అది కూడా నాటి అధికార, ప్రతిపక్షాలు ఆమోదించిన అమరావతినే రాజధానిగా ఉంచడం. ఇదే అమరావతి రాజధాని రైతులు రెండవ దఫా చేపట్టిన పాదయాత్ర ఆధ్యంతం నినాదాలతో సాగుతున్న డిమాండ్ పోరు యాత్ర. అమరావతి నుండి అరసవళ్లి వరకు చేపట్టిన రైతుల మహా పాద యాత్ర 19వ రోజుకు చేరుకొనింది.
ఏపీ ప్రభుత్వ తీరు పై తెలంగాణ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు, ఉపాద్యాయుల పై కర్కశంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. కేసులు పెడుతూ, జైల్లో వేస్తున్నారని మంత్రి హరీష్ మాట్లాడారు
ఏపీ ప్రభుత్వంకు హైకోర్టులో స్టేలు, మొట్టికాయలు కామన్ అయిపోయాయి. తాజాగా ఓ కేసు విషయంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో అమల్లోను 6వారాల పాటు నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది.