Home / Ap Government
రాజధాని అమరావతిపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. ధర్మాసనం ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని రైతులు హైకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. రేపటిదినం త్రిసభ్య ధర్మాసనం కేసును విచారించనుంది.
ఉన్న కేసుల్లోనే పలు మొట్టికాయలు తింటున్న ప్రభుత్వ పనితీరు మారదంటూ ఏపీ హైకోర్టులో మరో కేసు దాఖలైంది.
ఏపీ సీఎం జగన్మెహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకొన్నారు. అన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లో అక్టోబర్ 25 నుండి ఫేస్ యాప్ హాజరును తప్పనిసరి చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
విశాఖలోని రుషికొండ తవ్వకాల అంశంలో సాగతుతున్న విచారణలో ఏపి ప్రభుత్వం పై హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యలు చేసింది.విచారణ నేపథ్యంలో, ధర్మాసనం తన మాటల్లో, రుషి కొండ తవ్వకాలపై కేంద్ర అటవీ శాఖ కమిటీ వేస్తానంటే ఎందుకు అడ్డుకుంటున్నారా? ప్రభుత్వం వైపు ఏదో దాచి పెడుతున్నట్లు అనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
చట్టాలు, మార్గదర్శకాలు, పద్ధతులను అమలు చేయడంలో ఏపీ ప్రభుత్వం గాల్లోకి వదిలేసింది. ఈ నేపథ్యంలో న్యాయస్ధానాల నుండి పలుమార్లు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగులుతోంది. ఇలాంటి పరిణామాలు ఏపీ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయాయి.
నీరు, రోడ్లు, విద్యుత్ వంటి కనీస వసతులను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదిగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో కిసాన్ క్రాఫ్ట్ ను సందర్శించిన సందర్భంలో ఆయన ఈ మేరకు రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై ప్రభుత్వానికి చురకలు అంటించారు
దశాబ్ధాల పాటు ఆయన కీర్తి అజరామం. తన గానంతో సప్త స్వరాలు పలికించారు. వేలాది పాటలు పాడిన ఘనత ఆయనది. దేశ విదేశాల్లో కోట్లాది సంగీత ప్రియుల మనసును దోచి అమరుడైన ఆ గాన గంధర్వుడికి గుంటూరులో ఘోర అవమానం చోటుచేసుకొనింది.
నెలపుట్టి మూడు రోజులు అవుతున్నా జీతం కోసం 50 నుండి 60శాతం మంది ఏపి ఉద్యోగులు, ఫింక్ఛన్ దారులు ఎదురు చూపులు చూస్తున్నారు. పండుగ పూట కూడ జేబులు వెతుక్కొనే పరిస్ధితులు చాలా మందికి ఏర్పడింది.
ఏపీ ప్రభుత్వం నేడు సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. రిజర్వ్ బ్యాంకు బాండ్ల వేలంలో ఈ మేరకు రాష్ట్రానికి అప్పు ముట్టింది
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి పట్ల జిల్లా కలెక్టర్ దుర్గారావు అమర్యాదగా ప్రవర్తించారు. హైకోర్టు జడ్జి మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రికి వస్తున్నారని ఈవో భ్రమరాంభకు ముందస్తుగా సమాచారం అందించారు. అయితే ఘాట్ రోడ్డులో జడ్జి వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు.