Home / Ap Government
MLA Shankar Narayana : పెనుగొండ ఎమ్మెల్యే మానుకొండ శంకర్ నారాయణ పైన గ్రామస్థులు రాళ్ళ దాడి చేశారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది.. దాడికి గల కారణాలు ఏంటి.. ఈ విషయంలో ఎవరికైనా గాయాలు అయ్యాయా వంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..
ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జగనన్న వసతి దీవెన పథకంలో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాలో బటన్ నొక్కి డబ్బులు జమ చేశారు. నార్పల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తున్నారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో ఈరోజు మరో
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అంశంపై రు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర దుమారం రేగుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ, ఏపీ మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. కాగా మంత్రి సీదిరి అప్పల రాజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్పై ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం సీరియస్ అయ్యింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ప్రభుత్వం కూడా బిడ్డింగ్ వేస్తోందన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల సెంటిమెంట్ అని.. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అన్నారు.
Mekapati Chandrasekhar Reddy : నెల్లూరు జిల్లా ఉదయగిరిలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్థానిక బస్టాండ్ సెంటర్లో కుర్చీ వేసుకుని కూర్చొన్నారు. గతంలో ఉదయగిరి వస్తే తరిమి కొడతామని ఆయన వ్యతిరేక వర్గం హెచ్చరించింది. దీంతో మేకపాటి బస్టాండ్ సెంటర్కు వచ్చారు. అంతే కాకుండా తనను తరిమికొడతానన్న వారు రావాలంటూ సవాల్ విసిరారు. అంతేకాకుండా వైసీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఏపీ రాష్ట్ర గవర్నర్ గా నియమితులైన అబ్దుల్ నజీర్ ఇటీవలనే బాధ్యతలు స్వీకరించారు. అబ్దుల్ నజీర్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్, శాసనమండలి చైర్మెన్.. శాసనసభ స్పీకర్, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. గతంలో సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన అబ్దుల్ నజీర్ ఇటీవలనే రిటైర్ అయ్యారు.
ఏపీలో రాజకీయాలు రణరంగంగా మారుతున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో పరిస్థితి అదుపు తప్పుతోంది ఏమో అనుమానం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలుగుతుంది. రాజకీయ దాడులు, ప్రతిదాడులతో.. గన్నవరం రాజకీయాలు మరింత వేడెక్కడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి తాజాగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ 43వ వార్షికోత్సవం శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కాపు, బలిజ, ఒంటరిలకు రిజర్వేషన్ల పై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిటీషన్ను హైకోర్టు వాయిదా వేసింది.ఈడబ్ల్యూఎస్ కోటా కింద కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ... చేగొండి హరిరామయ్య జోగయ్య దాఖలు చేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.
ఏపీలో అధికారంలో ఉన్న వైకాపా ఎమ్మెల్యే.. ఒక బ్యాంక్ మేనేజర్ తో కుమ్మక్కై 87 కోట్ల విలువైన ఆస్తుల్ని వేలంపాటలే బిడ్డర్లను భయపెట్టి 11 కోట్లకే సొంతం చేసుకున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది.