Home / Ap Government
Chandra Babu Naidu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ సర్కారు భారీ షాక్ ఇచ్చింది. విజయవాడలోని కరకట్టపై ఉన్న చంద్రబాబు నాయుడు గెస్ట్హౌస్ ని అటాచ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్రిమినల్ లా అమెండమెంట్ 1994 చట్టం ప్రకారం గెస్ట్ హౌస్ ని అటాచ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. సదరు గెస్ట్ హౌస్ విషయంలో చట్టాలు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలు, సాధారణ ఆర్థిక నియమాలు పూర్తిగా ఉల్లంఘించారని ఆరోపించింది. […]
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అతిపెద్ద కార్యక్రమం చేపట్టడానికి శ్రీకారం చుట్టింది. "మహాయజ్ఞం" పేరిట ఆరు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేయనున్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ ఈ మహా యజ్ఞం నిర్వహిస్తున్నామని ఏపీ సర్కారు వివరించింది. మొదటి రోజు, చివరి రోజు జరిగే రాజశ్యామల యాగంలో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. జగన్ సర్కారు ఏర్పాటు చేసిన “సిట్” (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) పై సుప్రీం కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్ దర్యాప్తు జరిపేందుకు ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు సుప్రీం తీర్పుతో లైన్ క్లియర్ అయ్యిందని చెప్పవచ్చు. కాగా అంతకు ముందు
తెలుగు చిత్ర పరిశ్రమలో రాజకీయాల రగడ కొత్తది ఏమి కాదు. అయితే ఇప్పుడు ఊహించని రీతిలో మళ్ళీ అనూహ్యంగా తెరపైకి వచ్చింది. నంది పురస్కారాలపై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ చేసిన వ్యాఖ్యలకు పోసాని కృష్ణ మురళి ఇప్పుడు గట్టి కౌంటర్ ఇవ్వడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏం జరిగిందో మీకోసం ప్రత్యేకంగా..
Posters In AP : ఏపీలో అధికార పార్టీకి వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు రావడం కలకలం రేపుతుంది. ఒక వైపు విజయవాడలో కార్మికులను రోడ్డున పడేసిన చరిత్ర వైసీపీదే అంటూ పోస్టర్లు వేశారు. మరోవైపు రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం-సుస్వాగతం అంటూ విశాఖలో ఏర్పాటుచేసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 3న విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయంతో ఏపీ రాజధాని లేని […]
MLA Shankar Narayana : పెనుగొండ ఎమ్మెల్యే మానుకొండ శంకర్ నారాయణ పైన గ్రామస్థులు రాళ్ళ దాడి చేశారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది.. దాడికి గల కారణాలు ఏంటి.. ఈ విషయంలో ఎవరికైనా గాయాలు అయ్యాయా వంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..
ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జగనన్న వసతి దీవెన పథకంలో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాలో బటన్ నొక్కి డబ్బులు జమ చేశారు. నార్పల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తున్నారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో ఈరోజు మరో
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అంశంపై రు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర దుమారం రేగుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ, ఏపీ మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. కాగా మంత్రి సీదిరి అప్పల రాజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్పై ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం సీరియస్ అయ్యింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ప్రభుత్వం కూడా బిడ్డింగ్ వేస్తోందన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల సెంటిమెంట్ అని.. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అన్నారు.
Mekapati Chandrasekhar Reddy : నెల్లూరు జిల్లా ఉదయగిరిలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్థానిక బస్టాండ్ సెంటర్లో కుర్చీ వేసుకుని కూర్చొన్నారు. గతంలో ఉదయగిరి వస్తే తరిమి కొడతామని ఆయన వ్యతిరేక వర్గం హెచ్చరించింది. దీంతో మేకపాటి బస్టాండ్ సెంటర్కు వచ్చారు. అంతే కాకుండా తనను తరిమికొడతానన్న వారు రావాలంటూ సవాల్ విసిరారు. అంతేకాకుండా వైసీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.