Home / Allu Arjun
ఇంత అందం పెట్టుకొని కూడా సినిమాల్లో నటించకపోవడం ఏంటి, నటిస్తే తప్పేమిటి? అని సోషల్ మీడియా లో ఆమె పెట్టే ఫోటోల క్రింద అభిమానులు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై స్నేహ రెడ్డి ఇప్పటి వరకు స్పందించలేదు
కూతురితో కలిసి అల్లు అర్జున్ కారులో నైట్ రైడ్ కు వెళ్లారు. కారులోనే ఇద్దరు కలిసి టిఫిన్ చేశారు. కాగా ప్రస్తుతం ఈ తండ్రీకూతుర్లు కారులో నైట్ రైట్ చేస్తూ టిఫిన్ చేస్తున్న ఈ ఫొటోను కూడా నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు.
సినీ పరిశ్రమలోనే కాకుండా ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన అల్లు అర్జున్ హవా కనిపిస్తుంది. టాలీవుడ్, బాలీవుడ్ తేడా లేకుండా ప్రతి చోట బన్నీ పేరు మార్మోగిపోతుంది. గతేడాది వచ్చిన పుష్ప సినిమాతో అల్లుఅర్జున్కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ మూవీలో అల్లుఅర్జున్ నటనకు ఇప్పటికే ఫిలింఫేర్, సైమా అవార్డులు కైవసం కాగా ఇప్పుడు మరో అత్యున్నత అవార్డును అందుకున్నాడు బన్నీ.
సౌత్ ఇండియా 67వ పార్లే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో అల్లు అర్జున్ పుష్ప: ది రైజ్కి స్వీప్ చేసింది
సినీ అవార్డుల కార్యక్రమాల్లో ఫిలింఫేర్ పురస్కారాలు చాలా ప్రత్యేకమైనవి. ఈవెంట్లో 2020,2021 సంవత్సరాలకుగాను ఫిలింఫేర్ అవార్డులకు ఎంపికైన వారి పేర్లు ప్రకటించారు. కాగా సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప ది రైజ్ చిత్రానికి అత్యధికంగా ఏడు అవార్డులు రావడం విశేషం.
పుష్ప సినిమాకు సీక్వెల్ అయిన పుష్ప-2 చిత్రం ప్రస్తుతం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ మోస్ట్ వెయిటెడ్ మూవీలో ఒక బాలీవుడ్ నటుడు కీలక పాత్ర పోషిస్తున్నారంటూ వార్త వైరల్ అవుతుంది.
అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి ఈ స్టూడియోస్ ను ప్రారంభించారు. అల్లు వారి కుటుంబం మరియు మెగాస్టార్ కుటుంబ సభ్యులు ఈ వేడుకకు హాజరయ్యారు. దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అల్లు రామలింగయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మెగాస్టార్.
అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవ వేడుక వైభవంగా జరిగింది. దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అల్లు స్టూడియోస్ ను మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2 ది రూల్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.‘పుష్ప ది రైజ్’ సినిమా ఎన్ని రికార్డ్స్ బద్దలు కొట్టిందో మనం ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు..పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ప్రస్తుతం అందరి చూపు ‘పుష్ప 2’పైనె పడింది.
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.అలాగే ఆ సినిమా నుంచి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మారి పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు.దీనితో మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అల్లు అర్జున్కు డిమాండ్ బాగా పెరిగింది.ఐతే తాజాగా అల్లు అర్జున్ గండిపేటలో అల్లు స్టూడియోను నిర్మిస్తున్నారని అనే వార్తా సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేస్తుంది.