PBKS vs RR: చివరి రెండు ఓవర్లలో 46 పరుగులు.. రాజస్థాన్ లక్ష్యం 188 పరుగులు
PBKS vs RR: ధర్మశాల వేదికగా జరిగే కీలక మ్యాచ్ లో పంజాబ్ తో రాజస్థాన్ తలపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది.
PBKS vs RR: చివరి రెండు ఓవర్లలో భారీగా పరుగులు రావడంతో పంజాబ్ భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది. ఆరంభంలో తడబడిన చివర్లో రాణించింది. పంజాబ్ బ్యాటర్లలో కరణ్, జితెష్ శర్మ రాణించారు. చివర్లో షారుఖ్ ఖాన్ రెచ్చిపోయి ఆడటంతో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది.
రాజస్థాన్ బౌలర్లలో సైనీ మూడు వికెట్లు తీశాడు. జంపా, బౌల్ట్ చెరో వికెట్ తీసుకున్నారు.